ఇరాక్ లో సేవలందించేందుకు వెళ్లి ఉగ్రవాదుల చేతుల్లో బందీలయిన 46 మంది భారతీయుల నర్సులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వారం రోజులుగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు కేరళ రాష్ర్ట ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన నర్సుల కిడ్నాప్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఉగ్రవాదుల చెరలోవున్న 46 మంది నర్సులను ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో కేరళకు తీసుకొస్తున్నట్లు ఆ రాష్ర్టప్రభుత్వం ప్రకటించింది.
గత మూడురోజులుగా ఇరాక్లోని తిక్రిత్ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ వాళ్లంతా నిరాకరించారు. దీంతో తెల్లవారుజామున బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. తిక్రిత్ పట్టణం నుంచి తొలుత మోసుల్ వైపు తీసుకెళ్లారు. నర్సులను ఎక్కడికి తీసుకెళ్లినదీ వివరాలు తెలియకపోవడంతో ఇటు ప్రభుత్వం, నర్సుల బంధువుల్లో ఆందోళన నెలకొంది.
మోదీ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆ దేశంతో పలుమార్లు మంతనాలు జరిపింది. చివరకు తిరుగుబాటుదారులతో ఇరాక్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. చివరకు నర్సులందరు క్షేమంగా వున్నారు. తిరుగుబాటుదారుల నుంచి ఎర్బిల్ నగరానికి వాళ్లంతా బస్సులో రానున్నారు. వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు నిన్న సాయంత్రం ఎయిర్ ఇండియా విమానం ఎర్బిల్ ప్రాంతానికి వెళ్లనుంది.
ఆ విమానంలో కేంద్రం, కేరళ అధికారులు వెళ్లనున్నారు. ఎర్బిల్ నుంచి వాళ్లని కేరళకు తీసుకువస్తారు. ఈరోజు ఉదయం 7 గంటలకు నర్సులతో విమానం కోచికి చేరుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్చాందీ చెప్పారు. ఇటు నర్సుల కుటుంబంలో సంతోషం వ్యక్తమైంది. ఈవిషయం తెలుసుకున్న నర్సుల తల్లిదండ్రులు ఊపీరి పీల్చుకున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more