Dwaraka peeth shankaracharya comments on saibaba again

Dwaraka Peeth Shankaracharya comments on Saibaba, Saibaba was Muslim Dwarakapeeth seer says, Dwaraka Peeth Swaroopananda comments on Saibaba, Swamy Swaroopananda comments hurt Saibaba devotees

Dwaraka Peeth Shankaracharya comments on Saibaba again

బాబా ముస్లిం కాబట్టే గంగలో మునగలేదట ఎప్పుడూ!

Posted: 06/29/2014 02:39 PM IST
Dwaraka peeth shankaracharya comments on saibaba again

ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద మరోసారి సాయిబాబా ముస్లిం అని, అందుకే హిందువులకు పవిత్రమైన గంగానదిలో మునగటానికి ఇష్టపడేవారు కాదని వ్యాఖ్యానం చేసారు.  సాయిబాబా తన భక్తులతో తాను ముస్లిం నని ప్రకటించుకుని గంగానదిలో స్నానం చెయ్యవద్దని చెప్పేవాడని కూడా స్వామి స్వరూపానంద అన్నారు.  

అంతేకాదు, ఆయన తను ముస్లింనని చెప్పుకున్నప్పుడు ఆయన విగ్రహాన్ని గంగానదిలో ఎందుకు ముంచుతున్నారని కూడా ఆయన ప్రశ్నించారు.  అంతటితో అయిపోలేదు.  సాయిబాబా భక్తులు శ్రీరాముడిని కొలవరాదని కూడా ఆయన అన్నారు.  

అంతకు ముందు కూడా సాయిబాబా మానవమాత్రుడే కానీ దేవుడు కాదని, ఆయనకు గుళ్ళు కట్టి పూజలు చెయ్యటం తగదని, కట్టిన గుళ్ళు చాలు ఇంకా కట్టవద్దని అన్నారు.  పురణాల ప్రకారం కలియుగంలో అవతార పురుషులు ఇద్దరేనని, ఒకరు బుద్ధుడు, రెండవ అవతారం కల్కి కలియుగాంతంలో వస్తారని, అందులో ఎక్కడా సాయిబాబా పేరు లేదని, అందువలన భూమ్మీదకు వచ్చిన అవతార మూర్తి కాదని సాయిబాబా గురించి అన్నారాయన.  

సాయిబాబా గుళ్ళను ప్రోత్సహిస్తున్న శక్తులు హిందువులలో ముసలం కలిగించాలని చూస్తున్నారని, అందువలన సాయిబాబాకి ఇక ఎక్కడా గుడి అనేది కట్టగూడదని కూడా శంకరాచార్యులు అన్నారు. 

సాయిబాబా భక్తులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తమ ఇష్టదైవమైన సాయిబాబా గురించి అలా మాట్లాడటం తమకు వేదన కలిగిస్తున్నదని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more