పశ్చిమ బెంగాల్ లో అది బిర్భూమ్ జిల్లా. డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాస్తున్న విద్యార్థి పేరు మొహమ్మద్ సైఫ్. ఏమిటి అతగాడి విశేషం అనుకుంటున్నారా? పరీక్షకు విగ్గుపెట్టుకుని రావటం!
సామాన్యంగా విద్యార్థి దశలో ఎవరూ విగ్గులు పెట్టుకోరు. ఆ అవసరం ఉండదు. కానీ ఈ విద్యార్థి అవసరం వేరు. పరీక్షల్లో కాపీ కొట్టటమనేది పాత పద్ధతి. బ్లూ టూత్ సాయంతో ప్రశ్నలకు జవాబులను తెలుసుకుంటూ రాసుకుంటూ పోవటం చీటింగ్ లో ఆధునిక విధానం.
రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ ఏకంగా మెడికల్ పరీక్షలనే బ్లూటూత్ సాయంతో రాసేస్తుంది. ఈ విద్యార్థి కూడా అదే పంథాలో బ్లూటూత్ ని అమర్చుకుని, అది బయటకు తెలియకుండా ఉండటం కోసం ఒక విగ్గు తగిలించేసుకున్నాడు. అది ఉంగరాలు తిరిగిన అందమైన విగ్గు.
ఆలోచించాల్సిన అవసరం లేకపోవటంతో తలవంచుకుని బుద్ధిమంతుడిలా పరీక్ష రాసుకుంటూ పోయిన ఆ విద్యార్థిని రెండురోజులు ఎవరూ అనుమానించలేదు. కానీ మూడోరోజున అతని అదృష్టానికి కాలం తీరింది. ఇన్వెజిలేటర్ కి అనుమానం వచ్చింది. తరచి చూస్తే విషయం బయటపడింది. ఔరా అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఆ విద్యార్థి అక్కడిను డి ఉడాయించాడు.
అయితే ఆ విద్యార్థి ఎవరో తెలుసు కాబట్టి ఫిలాసఫీ హానర్స్ చదువుతున్న సైఫ్ ని సైయంతియా ఆవేదానంద కాలేజ్ ప్రిన్సిపాల్ డిబార్ చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more