మొట్టమొదటి సారి.. కొత్తగా రెండు రాష్ట్రాల స్పీకర్లు తెరలేపారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత.. ఇరుప్రాంతాల రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, ఇలా కలుసుకున్న సందర్భం చాలా తక్కువు. అలాంటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల స్పీకర్లు కోడెల శివ ప్రసాదరావు, సిరికొండ మధుసూధనాచారి అభిప్రాయ పడ్డారు.
ఒకే ఆవరణలో రెండు రాష్ట్రాల శాసనసభల నిర్వహణతో ప్రోటోకాల్ సమస్య వస్తుందని రెండు శాసనసభల తొలి సమావేశాలు ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల తొలి శాసనసభాధిపతులు అసెంబ్లీ హాలులో సమావేశం అయ్యారు. తొలుత వారిద్దరూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఒకే ఆవరణలో రెండు అసెంబ్లీలు ఉండడం వల్ల స్పీకర్ పరిధి, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు.
జుబ్లీహాలులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్వహించుకుంటే మంచిదని తెలంగాణ సభాపతి మధుసూధనాచారి పేర్కొంటే, దానిపై తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడులతో చర్చించాక నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పేర్కొన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఒకేచోట ఉంటే భావుంటుందని కోడెల శివప్రసాద రావు అన్నట్లు సమాచారం. తమ శాసనమండలి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని కోడెల ప్రశ్నించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల శాసనసభల బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యేలోగా ఈ సమస్య పరిష్కరించుకుందామని చారి, కోడెల అభిప్రాయానికి వచ్చారు.
అయితే చివరిగా.. రెండు రాష్ట్రాల ఉద్యోగుల గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని .. ఇద్దరు అనుకోవటం జరిగింది. మాట్లాడుకోవటం కంటే.. ఉద్యోగుల జీవితాల గురించి కూడా మనం ఆలోచిద్దాం అని కోడెల, ఛారితో చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించుకోవాలన్న అభిప్రాయానికి వారిద్దరూ వచ్చారు. వచ్చేనెలలో మరోసారి భేటీ కావాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఒక రాష్ట్రం ఉద్యోగులు మరో రాష్ట్రానికి వెళ్లారని, వాటిని కూడా పరిష్కరించుకుందామని చెప్పారు.
ఏమైన ఇది ఒక మంచి పరిమాణమే అని ఇరుప్రాంతాల రాజకీయ నేతలు అంటున్నారు. ఇలా మాట్లాడుకుంటే.. ఎవరికి ఎలా సమస్యలు రావని తెలుగు ప్రజలు అంటున్నారు. ఇకనైన ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి, తెలుగు ప్రజలు అభివృద్ది గురించి పట్టించుకోవాలని రాజకీయ మేథావులు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more