Bengal assembly resolutioin on railway charges

bengal assembly resolutioin on railway charges, bengal assembly resolutioin, bengal assembly resolutioin on railway charges, pm narendra modi latest news, bengal assembly fires on narendra modi, narendra modi getting bad comments, narendra modi increases the railway charges, bengal state parliamentary affairs minister partha chatterjee, partha chatterjee resolution on railway charges

bengal assembly resolutioin on railway charges,

మోదీపై వ్యతిరేక పవనాలు ప్రారంభం

Posted: 06/23/2014 04:15 PM IST
Bengal assembly resolutioin on railway charges

(Image source from: bengal assembly resolutioin on railway charges)

కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా తుడిచిపారేసి, అధికారాన్ని చేజిక్కించుకున్న మోడీ ప్రభుత్వానికి అప్పుడే విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇటీవలే రైల్వే ఛార్జీలను భారీగా పెంచడంతో ప్రతిపక్ష పార్టీ నేతలు బీజేపీ పార్టీపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ప్రతిఒక్కరు బీజేపీ పార్టీపై విమర్శించడం మొదలుపెట్టేశారు. ప్రయాణికుల మీద 14.2 శాతం, సరుకుల రవాణా మీద 6.5 శాతం వరకు భారీగా రైల్వే ఛార్జీలను పెంచిన విషయం అందరికీ తెలిసిందే!

తాజాగా ఈ రైల్వే ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ...  పశ్చిమ బెంగాల్ శాసనసభ వ్యతిరేక తీర్మానం చేసింది. వెంటనే రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించాలంటూ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి అయిన పార్థ ఛటర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... ‘‘చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇంతపెద్ద మొత్తంలో రైల్వే ఛార్జీలను ఎవ్వరూ పెంచలేదు. దీంతో సామాన్య ప్రజలపై ఎక్కువ భారం పడుతుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. వీలైనంత త్వరగా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం’’ అని ఆయన చెప్పారు.

అంతేకాదు... ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయంపై తమ అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. ‘‘అధికారంలోకి వచ్చి ఇంకా నెలరోజులయినా కాలేదు.. అప్పుడే ఇంత భారీ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం. ఇది సామాన్య ప్రజలపై భారం కాదా? ఇది ఎంతవరకు న్యాయమంటారు? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటే... ముందుముందు సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూడాల్సి వస్తుంది’’ అని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more