(Image source from: Chandrababu naidu In Kuppam tour)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబునాయుడు మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటించారు. ఈ విధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంకు విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఆయనకు అభినందనలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. కుప్పంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో రెండురోజులవరకు బసచేసిన చంద్రబాబునాయుడిని కలుసుకోవడానికి చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి తెదేపా శ్రేణులు తరలివచ్చారు. అందరినీ సాదరంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారి సమస్యలను, వారి ప్రాంతాల అభివృద్ధికి కావలసిన అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నాయకులతో సమావేశం ముగిసిన తరువాత హెలికాప్టర్ లో బెంగుళూరుకు బయలుదేరిన చంద్రబాబు... తిరిగి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు.
మొదటగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కలుసుకోవడానికి తండోపతండాలుగా తరలిరావడంతో ఆ ప్రాంత పోలీసులు వారిని ఒక్కసారిగా అడ్డుకున్నారు. అంతేకాకుండా... ఒక పోలీసు అధికారి ఒకరిద్దరి నాయకులపైన చెయ్యి చేసుకోవడం జరిగింది. దాంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య కొద్దిసేపటివరకు ఘర్షణ కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన సమావేశంలో మాట్లాడుతూ... ‘‘నేను ఈ ఘర్షణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎవరైతే పార్టీ కార్యకర్తలపై చెయ్యి చేసుకున్నారో వారిని తక్షణమే సస్పెండ్ చేయిస్తాను’’ అని విరుచుకుపడ్డారు.
మరోవైపు ప్రాంత అభివృద్ధిపై మాట్లాడిన సీఎం చంద్రబాబు... కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా మార్చాలనే ఆలోచనతోనే ఆయన ఇక్కడి నుంచి పోటీచేశానని తెలిపారు. అలాగే ‘‘కుప్పం నియోజకవర్గ ప్రజలు నామీద చూపిస్తున్న అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాంగ్రెస్ చేసిన అడ్డగోలు పాలనతో మన ఆంధ్రరాష్ట్రం రెండుగా విభజించబడి కష్టాల్లో కూరుకుపోయాయి. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో వున్నారు. సీమాంధ్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, నేను (చంద్రబాబు) పూర్తిగా నిర్వర్తిస్తామని మాటిస్తున్నాను’’ అని ప్రసంగించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more