మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇరవై నుండి ముప్పై మంది వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి సీనియర్ నేతలు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకివ్వనున్నారా? ముందు ముందు పార్టీని నడపటం సాధ్యమేనా? అంటే కష్టమే అన్న సమాధానం వస్తుంది. కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలతో టచ్లో ఉండటం జరుగుతోందట.
వైసిపి కి చెందినా ఖమ్మం ఎం పి పొంగులేటి తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టి ఆర్ ఎస్ అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నట్టు సమాచారం.
జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కార్పోరేటర్లు టిడిపిలో చేరేందుకు సంసిద్ధత చూపుతున్నారట. తాము టిడిపిలో చేరుతామని వారు స్థానిక నేతలకు చెబుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ మాట్లాడుతామని, ఇప్పుడు వద్దని తెలుగు తమ్ముళ్లకు సూచించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తీవ్ర నిరాశలో ఉన్న జగన్ ఈ పెద్ద గండం నుండి బయట పడటం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చంద్రబాబు విజన్ తోనే తమ భవిషత్తు ఉంటుందని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తాము జగన్ గురించి తెలియక ఆ పార్టీలో ఇరుకున్నామని ఒక ఎమ్మల్యే అంటున్నారు. కేవలం జగన్ మీద అవినీతి ఆరోపణలే తమ కొంప ముంచాయని ఓడిన నాయకులు అంటున్నారు. దీనిని బట్టి జగన్ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.
ఒక్కరొక్కరిని కాకుండా.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందర్నీ ఒకేసారి చేర్పించుకుంటే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. పవన్ కళ్యాణ్ స్లోగన్ "YSRCP HATAO, Seema Andhra Bachao" ఎఫెక్ట్ YSRCP మీద , జగన్ మీద బాగా పడినట్టుంది!!!
తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారని...తమ పార్టీలోకి వచ్చేందుకు వారంత సిద్ధంగా ఉన్నారని జలీల్ ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more