తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా విమర్శల పర్వం మొదలైపోయింది.
గద్దర్:
సమైక్య ఆంద్రప్రదేశ్ లో అగ్రవర్ణాలదే అదికారంగా ఉండగా, తెలంగాణ వచ్చిన తర్వాత బడుగులకు అదికారం వస్తుందని అనుకున్నామని,కాని అది అడియాశే అయిందని గద్దర్ ధ్వజమెత్తారు.
దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిన కెసిఆర్ ఊసరవెల్లిలా రంగులు మార్చి తానే ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. తెలంగాణ వచ్చినా దొరల పాలన తప్పలేదని గద్దర్ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి మాట తప్పారని ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన వాగ్దానాలలో 25 శాతమైనా నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని, అలా జరగకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమబాటలో పయనిస్తారని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మీద గద్దర్ స్పందిస్తూ, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, అయితే ఈ ఎన్నికలలో త్యాగం గెలవలేదని, స్వార్థమే గెలిచిందని అన్నారు. ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికలలో ఓడిపోవడం, తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళు గెలవటం దీనికి ఉదాహరణ అని గద్దర్ అన్నారు. త్యాగానికి ప్రతీక అయిన శంకరమ్మ ఓడిపోవడానికి, ఎలాంటి త్యాగాలూ చేయనివాళ్ళు గెలవటానికి రాజకీయ గారడీలే కారణమని ఆయన చెప్పారు
రేవంత్రెడ్డి:
కేసీఆర్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాదని, కేసీఆర్ కుటుంబ మంత్రివర్గం, తండ్రీకొడుకులు, అల్లుడు కలసి సొంత ఆస్తిని పంచుకన్నట్టు మంత్రివర్గాన్ని పంచుకున్నారని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. 12 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో కేసీఆర్తో కలిపి ముగ్గురు ఆయన కుటుంబానికే చెందినవారు వున్నారని విమర్శించారు.
వెనుకబడిపోయిన మహబూబ్నగర్ జిల్లాకు కేసీఆర్ కేబినెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, టీఆర్ఎస్కి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లాకి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రిపదవులకు అర్హులు కాని సన్నాసులు.. దద్దమ్మలా అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా మంత్రివర్గంలో కూడా దళితులకు స్థానం కల్పించలేదని విమర్శించారు.
తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం లేకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. అమరవీరుల త్యాగాలను శాశ్వతంగా కనుమరుగుచేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చిహ్నాన్ని పునఃపరిశీలించాలని ఆయన కేసీఆర్కు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more