"కొందరిపై నేను విమర్శలు చేస్తున్నానని రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటికి నేను బెదిరేదిలేదు. నాకు భయం అంతకంటే లేదు'' అని జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లోని నరసాపురం, తణుకు, కాకినాడ, రాజమండ్రిలలో జరిగిన బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు,జనం పడుతున్న కష్టాలను చూసే తాను బయటకు వచ్చి జనసేన పార్టీ పెట్టానని చెప్పారు.
జగన్ అంటే తనకు భయం లేదని పవన్ స్పష్టం చేశారు. "జగన్ అంటే భయంలేదు, జగన్ అంటే శత్రుత్వంలేదు. దోపిడీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాను. జగన్ దోపిడీ చేసి జైలుకు వెళ్ళాడు. నేను మాత్రం దోపిడీని ఎదిరించడానికి, సీమాంధ్రను రక్షించడానికి జైలుకు వెళ్లడానికెనా సిద్ధమే''అని అన్నారు. .
బెదిరింపులేకాదు, తనపై దాడులకు కూడా దిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.తుమ్మితే పోయే ప్రాణాలంటే తనకు లెక్క లేదని పవన్ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. తనపై ఎవరైనా దాడులు చేస్తే..దౌర్జన్యాలు, తుపాకులు ఉండవని.. భరతమాతకు జై అంటూ సమూహంగా నడుచుకువెళ్తానని చెప్పారు. తనను బెదిరించేవారు ఆ దుమ్ముధూళికి భస్మమైపోతారని హెచ్చరించారు.
ప్రశ్నించినందుకే కేసీఆర్ తనను తిడుతున్నారని మరి తెలంగాణను దోచేసిన వైఎస్ గురించి ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి భూ దాహానికి కాకినాడ సెజే నిదర్శనమని ధ్వజమెత్తారు. వైసీపీ భూకబ్జాదారులను చూస్తుంటే 'అది కడుపా..కంబాల చెరువా' అర్థం కావడం లేదన్నారు. అవినీతిపరుల దోపిడీ ఇలాగే కొనసాగితే సీమాంధ్రలో ఖలిస్థాన్ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. "భగవంతుని పేరు చెప్పి దోచుకుంటున్న వారిని చూసి, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న వారిని చూసి, భూ కబ్జాదారులను చూసి తట్టుకోలేకపోయాను. అటువంటి అవినీతిపరులను ప్రజాజీవితం నుంచి పక్కకు నెట్టాలనే సంకల్పంతోనే పార్టీ స్థాపించాను.
నాకు జగన్లా లక్షల కోట్లు సంపాదించాలని లేదు. పార్టీలను అడ్డుకుని పదవులను పొందాలని లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. ప్రజా హక్కులను కాలరాస్తే నాలో ఆవేశం రగులుతుంది. దేశం, సమాజం కోసమే వచ్చాను. అందుకే నా సినిమాల్లో దేశభక్తి పాటలు ఉంటాయి'' అని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more