ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీమాంధ్రలో తల్లి కాంగ్రెస్ ఎలాగూ పోయింది, ఇక పిల్ల కాంగ్రెస్ను (వైసీపీ) తరిమేయాలని సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓదార్పు పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ వల్లమాలిన ప్రేమ కురిసిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అభిమానుల ప్రేమ ముందు ముఖ్యమంత్రి పదవి గొప్పది కాదని అన్నారు.
ఓట్లు ఎంత గట్టిగా అడుగుతున్నానో... అలాగే ప్రజా సమస్యలపై కూడా మీకోసం ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అంటే చేతిలో ఆయుధాలు ఉండవని, అక్రమాక్కులను తొక్కుకుంటూ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బు పంచితే ఈసీకి పిర్యాదు చేయాలని సూచించారు. వైసీపీ ఇచ్చే డబ్బు తీసుకుని టీడీపీ-బీజేపీ కూటమికి ఓటు వేయాలని పవన్ పేర్కొన్నారు. కడప, పులివెందుల తరహా దౌర్జన్యాలను ఆపాలని ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజా హక్కులను కాలరాస్తే ఆవేశం ఉప్పొంగుతుందని, అవినీతి పరులకు కోనసీమ పౌరుషాన్ని రుచి చూపెట్టాలని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ సీఎం కావాలని ఎలా కోరుకుంటున్నావని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more