గురువారం రాత్రి విశాఖలో జరిగిన ఎన్డీయే భారత్ ర్యాలీలో పాల్గొన్నజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్, విశ్రాంతి తీసుకోవాలసిన సమయంలో తన స్వార్థం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తన తల్లి విజయమ్మను ఎన్నికల ప్రచారం కోసం ఎండలో తిప్పుతున్నారని ఆరోపించారు.
నిజమైన కొడుకు ఎవరైనాసరే వయసు వచ్చిన తల్లిని గుండెలో పెట్టుకుని ఇంట్లో చూసుకుంటారా? లేక ఎండల్లో తిప్పుతూ తల్లిని కష్టపెడతారా? అని ప్రశ్నించారు. కన్న తల్లినే స్వార్ధానికి ఉపయోగంచుకుంటున్న జగన్ రేపు సీమాంధ్రకు ఏం చేస్తారని పవన్ ప్రశ్నించారు. దీనిన ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.
ఒక వైపు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఇంకొకవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్ సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నారని, రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోయిందంటే దానికి కారణం జగన్ సీఎం కావాలనే స్వార్థపూరితమైన కోరికే అని పవన్ విమర్శించారు. ఇలాంటి స్వార్థపరులకు ఓటు వేస్తే... గుడిని... గుడిలో లింగాన్ని మింగేస్తారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ కుటుంబం మొత్తం రాజకీయల పదవుల కోసం సీమాంద్ర తిరుగుతుంది, సీమాంద్ర ప్రజల కోసం కాదని పవన్ అన్నారు.వైసీపీ అధికారంలోరాదని పవన్ జోష్యం చెప్పారు
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more