ఎప్పటిలాగానే ఈసారి కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీపై వున్న ఆరోపణల్ని ఆమె తెరమీదకు తీసుకొస్తూ.. తనదైన స్టైల్లో ప్రశ్నలు సంధించారు. టీడపీ నేతలపై సెటైర్లు వేయడం, వారు చెప్పిన మాటలపై కౌంటర్లు వేయడం, ఇంకా పలురకాలుగా తన ఆగ్రహాన్ని ఆ పార్టీపై వెళ్లగక్కారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసుపై శాసనసభలో తాము వాయిదా తీర్మానం ఇస్తే.. అందుకు టీడీపీ ఉలిక్కిపడుతోందని రోజా ఆరోపించారు. ఈ తీర్మానంపై టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఓటుకు నోటు కేసు కోర్టులో వున్నందున దీనిపై చర్చకు అనుమతించనని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. జగన్ కేసులపై టీడీపీ నేతలు రోజూ మాట్లాడుతున్నా.. స్పీకర్ మౌనంగా ఉండటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
ఇక టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో ఎన్నో లొసుగులు వున్నాయని, తెరవెనుక డబ్బుల్ని దండేస్తున్నారని రోజా ఆరోపించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ యత్నించిందని విమర్శించారు. ఆడియోలో ఉన్న స్వరం చంద్రబాబుదా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడే మార్గాలను అన్వేషించేందుకు ఇప్పటివరకు డీజీపీతో చంద్రబాబు 15 సార్లు సమావేశమయ్యారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more