టాలీవుడ్ రంగుల ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎక్కడి నుంచో వచ్చిన నటి నీతూ అగర్వాల్... చివరికి ‘ఎర్ర’ స్మగ్లింగ్ లో కూరుకుపోయి తన కెరీర్ ని నాశనం చేసుకుంది. తన ఆశల హరివిల్లులో విహరిద్దామని కోరికలు కనేలోపే మస్తాన్ వలీ చీకటి రూపంలో ఈమెకి పరిచయం అయ్యాడు. అంతే! అక్కడి నుంచి ఈమె జీవితంలో వెలుగే కరువయ్యింది. కనీసం స్వేచ్ఛగా శ్వాస తీసుకోవాలని నీతూ భావించినా.. ఆ చీకటి గదిలో కిటికీలు లేకుండాపోయాయి. అటువంటి జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది.
దీంతో చేసేదేమీ లేక.. ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ కెరీర్ ని ముందుకు నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంతలోనే ‘ఎర్ర’ మసి అంటుకోవడంతో జైలుపాలు కావల్సి వచ్చింది. చివరికి ఈమె బెయిల్ మీద విడుదలయ్యింది. కర్నూలు జైలు నుంచి గురువారం రిలీజ్ అయిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడింది. తనకు ఈ స్మగ్లింగ్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని.. తన జీవితాన్ని నాశనం చేసిన మస్తాన్ వలీతో తాడోపేడో తేల్చుకుంటానని ఆగ్రహం వెళ్లగక్కింది. అతడు తనను నమ్మించి, నిండా మోసం చేశాడని ఆమె ఆవేదన వెళ్లగక్కింది. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలనూ ఆమె వెల్లడించింది.
నీతూ మాట్లాడుతూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ఆమె తెలిపింది. అంతకు మించి అతడి గురించి తనకేమీ తెలియదంది. ఇద్దరం కలసి ప్రేమ ప్రయాణం చిత్రంలో కలిసి నటించామని... ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నామని వెల్లడించింది. అయితే అతడు ఎక్కడి నుంచి వచ్చాడు... సినీ రంగానికి ఎలా వచ్చాడు... అనే అంశాలపై మస్తాన్ వలీని తాను ఏ రోజు ప్రశ్నించలేదని తెలిపింది.
ఏటీఎమ్ కార్డు కావాలని ఓ భర్తగా మస్తాన్ అడిగాడని.. భార్యగా తాను ఇచ్చానని ఆమె చెప్పింది. తన ఏటీఎం కార్డును మస్తాన్ దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవరిని మోసం చేయలేదని చెప్పింది. తాను ఏ తప్పు చేయలేదని... భవిష్యత్తులో తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని నీతూ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more