రాజకీయాలు అన్నాక అధికార పార్టీపై ప్రత్యర్థి పార్టీ సభ్యులు, అలాగే వాళ్లు వీళ్లపై విమర్శలు చేయడం సర్వసాధారణమే! ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిత్యం విమర్శలు చేయడానికి పనిగా పెట్టుకున్నట్లున్నారు. తమ అధ్యక్షురాలు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె వల్లే కేసీఆర్ సీఎం అయ్యారంటూ ఆ పార్టీ సభ్యులు ఆరోపణలు చేస్తుంటారు. కేసీఆర్ సీఎం అయి చాలారోజులు కావచ్చినప్పటికీ.. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆయన ఏమీ చేయలేదంటూ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు ఇదే తరహాలో తాజాగా టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
* తమ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని ఆయన అన్నారు.
* టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై కేసీఆర్ కు ఫర్మానా పంపితే తమకు వద్దని వెనక్కు పంపారని ఎద్దేవా చేశారు.
* తప్పుడు హామీలతో ప్రతిరోజు ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ పై జనాలే స్పందించే రోజు వస్తుందని చెప్పారు.
* కేసీఆర్ తప్పుడు హామీలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ‘కేసీఆర్ ఫేక్ ప్రామిసెస్’ పేరుతో ట్విటర్, ఫేస్ బుక్ అకౌంట్లు తెరిచామని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more