Cabinet meeting on telangana

Cabinet Meeting on Telangana, Cabinet final Meeting on Telangana, GOM members, GOM meeting seemandhra leaders, congress party, telangana state, telangana bill,

Cabinet Meeting on Telangana , Cabinet final Meeting on Telangana

కేబినెట్ లో జరిగిన గుసగుసలు ఇవే?

Posted: 12/06/2013 01:46 PM IST
Cabinet meeting on telangana

కేబినెట్ గదిలో సీమాంద్ర నేతలు ఢిల్లీ పెద్దలతో గుసగుసలాడిన మాటలు ఇవే. సొంతపార్టీ అధిష్టానమే మమ్మల్ని రాజకీయంగా హత్య చేస్తోంది, ఏ ముఖం పెట్టుకొని తిరిగి ప్రజల వద్దకు వెళ్లగలం, సీమాంధ్ర ప్రయోజనాలను బేఖాతరు చేసి, కోట్లాది మంది మనోభావాలను విస్మరించి వారి జీవితాలతో చెలగాటమాడుతుండడాన్నిఎలా సహించగలం, ఒక్క వ్యక్తి కి భయపడి రాష్ట్ర ప్రయోజనాలనుపణంగా పెడతారా?’ అంటూ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం.పల్లంరాజులు కేంద్ర మంత్రివర్గంలో వ్యక్తం చేసిన ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది.

 

ఇంతటి కీలకమైన అంశాన్ని చివరి నిముషంలో టేబుల్‌ ఐటమ్‌గా ప్రవేశపెట్టి కేబినెట్‌ నోట్‌, పునర్విభజన బిల్లులోని అంశాలను అధ్యయనం చేసే సమయం కూడా ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యమా?, వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా కనీసం ఇరవై నాలుగు గంటలపాటైనా వాయిదా వేయండి అన్న వారి అభ్యర్థనను కూడా తిరస్కరించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తిరస్కరించింది.

 

రాష్ట్రాన్ని విభజించి పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను స్వాగతించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన శాస్త్ర,సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేయగా సీమాంద్రకు చెందిన కావూరి, పల్లంరాజులతో పాటు గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్‌ శాఖల మంత్రి వి.కిశోర్‌చంద్ర దేవ్‌లు తీవ్ర నిరసనను వ్యక్తం చేసినా కాంగ్రెస్‌ అధినేత్రి నిర్ణయానికి మంత్రివర్గం అధికారిక ముద్రవేసింది.

 

హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే విభజన ప్రతిపాదన ముఖ్యాంశాలను వివరించి ఆమోదానికి ప్రతిపాదించడంతో మొదటగా మాట్లాడిన కావూరి సాంబశివరావు రాష్ట్ర విభజనకు ఎలాంటి శాస్త్రీయబద్ధ ప్రాతిపదిక కనిపించడం లేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తెలియవచ్చింది.

 

విభజన విషయమై దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన చర్చలో పలుసార్లు జోక్యం చేసుకొన్న కావూరి సాంబశివరావుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజు నుండి పూర్తి మద్దతు లభించినా కొన్ని అంశాలపై తెలంగాణకు చెందిన మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు సీమాంధ్రకే చెందిన మరో కేంద్ర మంత్రి కిశోర్‌చంద్ర దేవ్‌ నుండి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని కనీసం రేపటివరకైనా వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తాము రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుకొంటున్నప్పటికీ, తమ వాదనలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విభజనకు అనుకూలంగా తీసుకొన్న నిర్ణయాన్ని గత్యంతరం లేని స్థితిలో తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని ప్రకటించిన కావూరి, పల్లంరాజులు సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా హైద్రాబాద్‌ నగరాన్ని శాశ్వతంగా లేదా కనీసం ఉమ్మడి రాజధానిగా వ్యవహరించినంత కాలమైనా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఒప్పించేందుకు మరోసారి విఫలయత్నం చేశారు.

 

అయితే, సీమాంధ్రకే చెందిన కిశోర్‌చంద్ర దేవ్‌ మాత్రం కావూరి ప్రతిపాదనతో ఏకీభవించలేదని తెలియవచ్చింది. ఒకరోజు, రెండురోజులు వాయిదా వేసినంత మాత్రాన సీమాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, విభజన అంశాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తే తాను కూడా సమర్థిస్తానని మంత్రివర్గం దృష్టికి తెచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more