పీసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు. రాజకీయ పార్టీలో విమర్శల దాడి చేయ్యటానికి సిద్దమయ్యారు. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ మీద బురదచల్లి, దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారి పైన వేటు వేస్తామని, సత్తిబాబు హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి జాబితాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలలోకి వెళ్ళేందుకు పార్టీ పైన బురద జల్లుతున్న డిసిసి, పిసిసి సభ్యుల పైనా ఆఖరికి వారు మంత్రులైనా సరే స్థాయితో నిమిత్తం లేకుండా వేటు వేస్తామన్నారు. ఇది తన మాట మాత్రమే కాదని అధిష్టానం మాట కూడా అని నొక్కొ చెప్పారు.
రాష్ట్ర విభజన చాలా సున్నితమైన అంశమని, అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా మాట్లాడుతారని బొత్స చెప్పారు. కాగా, పక్క చూపులు చూస్తున్న వాళ్లే విభజన అంశంలో పార్టీని ముద్దాయిని చేస్తున్నారని, వాళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని సత్తిబాబు చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని బొత్స అన్నారు. మరోసారి తనను కొత్త పార్టీ విషయమై అడగవద్దని బొత్స మీడియాను కోరారు. అయితే సత్తిబాబు ఎవరి గురించి అన్నారో మాత్రం ఎవరికి అర్థం కాలేదు.
అంటే రీసెంట్ గా మాజీ మంత్రి దర్మాన ప్రసాద్.. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు గోడలు దూకుందే సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అలా గోడలు దూకే నాయకులు సహజంగా.. పార్టీ అధిష్టానం పై బురద చల్లి వెళ్లటం జరుగుతుంది. ఏదో ఒక హాట్ కామెంట్ చేసి, ఇతర రాజకీయ పార్టీలోకి వెళ్లిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా మోపిదేవి వెంకటన రమణ కూడా వైఎస్ జగన్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ పై తీవ్రమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాంటి నాయకులను సత్తిబాబు ద్రుష్టిలో పెట్టుకొని ముందుగానే వార్నింగ్ ఇవ్వటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more