ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర విభజన పై జాట్ స్పీడ్ తో ముందుకు పోతున్నట్లు సమాచారం. సోనియా అధ్యక్షతన దాదాపు గంటన్నర సేపు జరిగిన కోర్కమిటీ సమావేశానికి ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, అహ్మద్ పటేల్లతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్సిబల్ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్వారా శాసనసభకు వెళ్లనున్న బిల్లు తిరిగి వచ్చే సమయాన్ని బట్టి డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పొడిగించాలా లేక ఆ తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేయడం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలా అన్న అంశాన్ని నిర్ణయించుకొంటామని ఆయన చెప్పారు. అయితే విభజనతో తలెత్తే పలు సంక్లిష్టమైన అంశాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను మరోసారి కూలంకషంగా చర్చించిన కాంగ్రెస్ కోర్కమిటీ గతంలో పార్టీ వర్కింగ్ కమిటీ, కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన పద్దతిలోనే రాష్ట్ర విభజన ప్రక్రియతో ముందుకు సాగేందుకు ప్రభుత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలియవచ్చింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే వచ్చేనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి పంపించేలా ప్రభుత్వస్థాయిలో అధికారిక ప్రక్రియను పూర్తిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించనున్న పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు ముంపుకు గురయ్యే కొంత ప్రాంతాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం మినహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల డిమాండ్లను వేటినీ ఆమోదించేందుకు జరిగిన కోర్కమిటీ సుముఖతను వ్యక్తం చేయలేదని విశ్వసనీయ సమాచారం.
అయితే మంత్రివర్గ ఆమోదం, సిఫార్సుతో తెలంగాణ బిల్లు వచ్చేనెల అయిదవ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకటి,రెండు రోజులు ముందుగానే రాష్ట్రపతికి పంపడం లక్ష్యంగా మొత్తం ప్రక్రియను పూర్తిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖరాఖండీగా చెప్పినట్లు ఎఐసిసి వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే ఉమ్మడి రాజధానిలో భూపరిపాలన , శాంతి, భద్రతలు, రెవిన్యూ, విద్యాసంస్థలపై అజమాయయిషీని కేంద్రం అధీనంలోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విద్య,ఉద్యోగాలలో రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి, తెలంగాణ బిల్లు ముసాయిదాలో పొందుపరచాల్సిన ఇతర అంశాలపై ఆయన న్యాయపరమైన, చట్టపరమైన నియమ, నిబంధనలకు సంబంధించి తన అభిప్రాయాలను కోర్కమిటీకి వివరించినట్లు తెలియవచ్చింది.
రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ హేతుబద్ధంగా జరిగేలా, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార నీటి నిర్వహణా బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను, విద్యుత్, బొగ్గు, గ్యాస్ వంటి సహజవనరుల పంపిణీ విషయంలో కూడా జీవోఎం చేస్తున్న ప్రతిపాదనలకే కాంగ్రెస్ అధిష్టానం వోటు వేసినట్లు సమాచారం.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగిన ప్రస్తుత ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ను మొత్తంగా కాకుండా కేవలం పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురయ్యే కొంత ప్రాంతాన్ని మాత్రం తెలంగాణ నుండి వేరుచేసి ఆంధ్ర రాష్ట్రం లో కలపాలని, భద్రాచలంలోని రామాలయంతో సహా మిగిలిన ప్రాంతాన్ని తెలంగాణలోనే కొనసాగించాలని కూడా కోర్కమిటీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలోని మునగాల పరగణా, ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతాలను కూడా సీమాంధ్ర రాష్ట్రానికి తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ను విస్మరించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more