ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర సమితే మోకాలడ్డుతోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కోస్తా తీరంలో నెలకొన్న గ్యాస్ నిక్షేపాల్లో, కేజీ బేసిన్ డి6లో తెలంగాణాకు వాటా కావాలని తాజాగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్ చేయడంతో విభజన ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోంది.
రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణ సరిహద్దుల్లో ఏ కోశాన చూసినా తీరప్రాంతం ఉండదని, అలాంటప్పడు సముద్రగర్భంలోని గ్యాస్ నిక్షేపాలపై వాటాను తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా డిమాండ్ చేస్తుందని సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 'మరో రాష్ట్ర భౌగోళిక పరిధిలోని వనరుల్లో వాటాను డిమాండ్ చేయడంలో ఏదో కుట్ర దాగి ఉంది
రాష్ట్ర విభజనతో గుండెకాయలాంటి హైదరాబాద్ పోతే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సీమాంధ్ర వాసులు ఆందోళన చెందుతుంటే పుండుమీద కారంలా కేజీబేసిన్లోనూ ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని టీఆర్ఎస్ కొత్త వాదనను తెరపైకి తేవడంతో విభజన ముడి మరింత చిక్కుపడ్డట్లయింది. ఈరోజు రాష్ట్ర విభజనపై వివిధ వర్గాలు, పార్టీల నుంచి వచ్చిన నివేదికలను అధ్యయనం చేయడానికి కేంద్రమంత్రి బృందం భేటీ కానునున్న తరుణంలో కేసీఆర్ కేజీ బేసిన్లో వాటా కోరడమంటే, చేతులారా విభజనకు ఆయనే అడ్డుపుల్ల వేస్తున్నట్లుగా భావించాలని విశ్లేషకుల అభిప్రాయం. .
ఇలాంటి డిమాండ్లు విభజన ప్రక్రియను సంక్లిష్టం చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరింత ఆలస్యమవుతుంద'ని పేరు చెప్ప డానికి ఇష్టపడని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు అన్నారు. కేసీఆర్ డిమాండ్కి అగ్నికి ఆజ్యం పోసినట్లు టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వినోద్కుమార్ మాట్లాడుతూ 'ఈ ఆస్తులు(కేజీ బేసిన్) భారత ప్రభుత్వానికి చెందుతాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపులున్నాయి.
ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేజీ బేసిన్లో వాటాను కోరుతున్నాం. కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాల్లో వాటాను కోరడంలో దుర్మార్గం ఏదీ లేద'న్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్రమంత్రి వర్గ బృందానికి టీఆర్ఎస్ సమర్పించిన నివేదికల్లో కేజీ బేసిన్లో వాటా కీలకమైంది. దీంతో పాటు దేశంలోనే రెండో అతి పెద్దదైన సింగరేణి బొగ్గు గనులపై సంపూర్ణ హక్కును తెలంగాణ రాష్ట్రానికే దఖలు పరచాలని టీఆర్ఎస్ కేంద్రమంత్రి బృందానికి సమర్పించిన నివేదికలో కోరింది.
ఇక హైదరాబాద్ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచనున్నందున, ఈ నగరంలో శాంతి భద్రతలను కేంద్రం పర్యవేక్షణలో ఉంచాలన్న ఆలోచన ఒకటి జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని కూడా టీఆర్ఎస్ కోరింది. టీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసి సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు పదేళ్లు అక్కర్లేదని, రెండు చాలని వాదించింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more