బాబు కొంపలో విభజన మంటలు అంటే.. నారా చంద్రబాబు కుటుంబంలో కాదు గానీ.. తెలుగుదేశం పార్టీలో మాత్రం విభజన మంటల రేగుతున్నాయి. అయితే ఈ విభజన మంటలతో.. ఎవరికి నష్టం జరుగుందో తెలియాదు గానీ, తెలుగుదేశం పార్టీ పరువు మొత్తం కాలిపోతుందనే పచ్చినిజం బయటపడింది. కాంగ్రెస్ ఆడుతున్న తెలంగాణ గేమ్ లో తెలుగు దేశం పార్టీ రంగు వెలిసిపోతుందనే భయం టిడిపి కార్యకర్తలకు పట్టుకుంది.
కొంతకాలంగా సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ మధ్య నడుస్తున్న వివాదం పార్టీలో చిచ్చు పెట్టింది. రాష్ట్ర విభజనపై పయ్యావుల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టీడీపీలో ముసలం మొదలయింది. తెలంగాణ నాయకులు పయ్యావుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించగా, సీమాంధ్ర నేతలు ఆయనను వెనకేసుకొచ్చారు. అప్పటినుంచి ఇరుప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.
తాజాగా పయ్యావుల కేశవ్పై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశం పెట్టి ఏకిపారేశారు. పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు పార్టీలో చీడ పురుగులంటూ దుయ్యబట్టారు. చీడపురుగులను ఏరివేస్తేనే పార్టీ బాగుపడుతుందని సలహాయిచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పుడు మాటలు తప్పుడు కూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని ధిక్కరించే దమ్ము పయ్యావులకు ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కోన్ కిస్కా అంటూ ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఏమరేమన్నా టీడీపీ తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. అసలే రాష్ట్ర విభజన పై తాభేలు నడకనడుస్తున్న చంద్రబాబు.. సొంత కొంపలో రగులుతున్న విభజన మంటలపై ఏ ప్రాంతం నీళ్లు చల్లాలో అర్థంగాక.. ఫేస్ బుక్ , పేస్ పెట్టి ఆలోచిస్తున్నారు. ఈ సమస్యకు త్వరలో ట్విటర్ ద్వారా చంద్రబాబు సమాధానం చెబుతారేమో వేచి చూడాలని ఇరుప్రాంతాల నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more