టైటిల్ ని వేరేగా అర్థం చేసుకోకండి. సినిమా హీరోయిన్స్ కదా ? అలాగే ఆలోచిస్తారు మరి. విషయం ఏంటంటే హీరోయిన్ లేనిదే సినిమా ఉండదు. ఇక ఒక్క సినిమా హిట్ అయితే వారి డిమాండే వేరు. అమాంతం రేటు పెంచడమే కాకుండా, ఒప్పుకున్న మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే సినిమా షూటింగ్ ను మధ్యలోనే వదిలిపెడతారు. ఇలాంటి పరిస్థితి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. దీంతో నిర్మాతలు పని కాకముందే మొత్తం పేమెంట్ చేసేస్తారు.
ఒక్కసారి మొత్తం తీసుకున్నా వారికి చుక్కలు చూపిస్తారు. కానీ కోలీవుడ్ లో మాత్రం హీరోయిన్ కి అంతగా డిమాండ్ ఉండదు. హీరోలదే హవా. అక్కడ హీరోయిన్ అంటే సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుతో సమానం. అందుకే అక్కడ ఒళ్ళంచి పనిచేస్తారు. అలాంటి ఇండస్ట్రీకే కొంతమంది హీరోయిన్లు దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపించడంతో వారు ఏ కఠిన నిర్ణయానికి వచ్చారు. వారిలో తమన్నా,సమంతా, కాజల్, శృతిహాసన్ లాంటి హీరోయిన్స్ కూడ ఉన్నారు. అందుకే ఇటువంటి హీరోయిన్స్కు చెమటలు పట్టించే ఒక నిర్ణయాన్ని కోళీవుడ్ నిర్మాతల మండలి తీసుకుంది.
ఇక నుంచి హీరోయిన్స్కి సినిమా షూటింగ్ పూర్తవ్వగానే 80% , ఆ తర్వాత ప్రెస్ మీట్స్ కి హాజరయితే ఇంకో 10%, అలాగే ప్రమోషన్స్ కి హాజరయితే మిగిలిన 10% రెమ్యునరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇన్ని రోజులు నిర్మాతలకు చుక్కలు చూపించిన హీరోయిన్స్ ఇక పై చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు. అయినా పని పూర్తికాక ముందు పేమెంట్స్ ఎవరిస్తారమ్మా.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more