తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబుకు సమాధి కట్టుకోండి? అని కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ సూచించారు. అసలు పొన్నం తెలుగుదేశం పై మండిపడటానికి కారణం ఏమిటి? అంటే.. చిత్తూరులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వింత నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి, ఆమె సమాధి కట్టి, యాగం చేయటం జరిగింది. ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొన్నం సార్ కు కోపం వచ్చి వెంటనే చంద్రబాబుకు సమాధి కట్టుకోండని ఉచిత సలహా ఇవ్వటం జరిగింది.
సోనియా గాంధీకి సమాధి కట్టడం తెలుగు దేశం పార్టీ నేతల సంస్కారహీనమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుకు సమాధి కట్టుకోవాలని పొన్నం సూచించారు. సమాధిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించకపోవటం చేతకానితనమని ఆయన అన్నారు. లేక టీడీపీతో సీఎం కుమ్మక్కు రాజకీయమా అని పొన్నం సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు కు సమాది కట్టుకోండి? పోన్నం చెప్పటం పై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలే చంద్రబాబు ఢిల్లీ ఏపీ భవన్ లో సమైక్యాంద్ర కోసం నిరాహార దీక్ష చేసి, ఆసుపత్రిలో చేరి, ఈరోజు డిశ్చార్జ్ అవటం జరిగింది. ఇంతలోనే.. పొన్నం ప్రభాకర్ చంద్రబాబు కు సమాధి కట్టుకోండని అనడం పై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయిన ఎవరి ఆవేశం వారిదనే విషయం రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఆవేశంలో ఎన్నో చేస్తారు అంతమాత్రన అవి నిజంగా జరిగినట్లు భావిస్తే ఎలా? తమ బాధను వ్యక్తం పరచటంలో వారికి నచ్చిన రీతిలో నిరసన తెలుపుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తే పెద్దవిగానే కనిపిస్తాయి. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ, మీడియా వారికి, రాజకీనాయకులకే ఉపయోగం ఉంటుంది. మీడియా వారికి న్యూస్ దొరుకుతుంది, రాజకీయ నాయకులకు పబ్లిసిటి లభిస్తుంది. అంతేగానీ ప్రజల ఎలాంటి ఉపయోగం లేదనే విషయం రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ప్రజలకు ఉపయోపడే సమస్యలపై మాట్లాడితే అందరికి ఉపయోగం ఉంటుంది. సో... రాజకీయ నాయకులు మారాలి. ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యలి. అయిన ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకోని ఏ నాయకుడికైన.. సమాధి కట్టే హక్కు ప్రజలకే ఉన్న విషయం తెలుసుకోవాలి....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more