జగన్ తండ్రి పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యాడు అంటే.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి మీద కాదులేండి? ఇటీవల జగన్ జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నుండి సీనియర్ రాజకీయ నాయకులు ఆ పార్టీ, ఈ పార్టీ అని తెడలేకుండా.. జగన్ ‘‘నా కొడుకు లాంటి వాడు ’’ , ‘‘జగన్ నా కొడుకుతో సమానం ’’, అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎక్కడికి పోయారు? ఇప్పుడు జగన్ జపం ఎందుకు చేస్తున్నారు? అనే దాని పై అంబటి ఫైర్ అయ్యాడు. అలాగే ఈరోజు కూడా ఆంధ్ర ప్రదేశ్లో పర్యటిస్తుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా జగన్ నా కొడుకు లాంటి వాడు అంటూ మీడియా ముందు చెప్పటం జరిగింది. ఈరోజు ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో విద్యుత్ సమస్యపై సీఎంతో మాట్లాడానన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై గౌరవం ఉందని దిగ్విజయ్ తెలిపారు. వైఎస్ తనకు మంచి మిత్రుడని, జగన్ తనకు కొడుకుతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే ముందు కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అలాగే టీడీపీ, వైసీపీలు కూడా విభజనను అంగీకరిస్తూ లేఖలు ఇచ్చారని, ఇప్పుడు మాటమారుస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం జరిగిందని, ఇప్పుడు వెనక్కి వెళ్లేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారు. మంత్రులు బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుందని, సమస్యలను కమిటీకి వివరించాలని ఆయన సూచించారు. ఆంటోనికి అనారోగ్యం కారణంగా ఏపీకి రాలేదని ఆయన వివరణ ఇచ్చారు.
అయితే వెంటనే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు. జగన్ తన కొడుకులాంటి వాడన్న దిగ్విజయ్..16 నెలలు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ను కలిపి ఒకే గాటన కట్టేయాలని దిగ్విజయ్ చేస్తున్న యత్నం అర్ధం లేనిదన్నారు. తన స్థాయి దిగజారి దిగ్విజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్పై కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ఇన్నిరోజులు కనిపించలేదా అని సూటిగా ప్రశ్నించారు. దిగ్విజయ్ లాంటి రాజకీయ నాయకులు చాలా మంది జగన్ పేరు చెప్పుకొని బ్రతుకున్నారని అంబటి అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more