Seemandhra ministers failure

Seemandhra Ministers failure, Anti-Telangana agitation, Seemandhra Congress leaders, pallam raju, JD silam, congress high command, samaikyandra movement,

Seemandhra Ministers failure

తోక ముడిచిన నేతలు ?

Posted: 10/07/2013 11:06 AM IST
Seemandhra ministers failure

సీమాంద్రలో సమైక్యాంద్ర కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయం లో కూడా రాజకీయ నాయకులు మాత్రం ఉలుకు, పలుకు లేకుండా ఉండిపోతున్నారు. అసలు కొంతమంది నేతల మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ దెబ్బకు తోకలు ముడిచారు. ఓవైపు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు చెలరేగుతుంటే, మరోవైపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు విభజనకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. మరొక మంత్రి సోనియాతో భేటీ అనంతరం మెత్తబడ్డారు. రాజీనామలతో విభజన ప్రక్రియ ఆగుతుందా అని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఈరు జు బెంగుళూరులో ప్రశ్నించారు. పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మరో మంత్రి జె.డి.శీలం పేర్కొన్నారు. రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసినా పార్టీని, ఎంపీ పదవిని వీడటంలేదని స్పష్టంచేస్తూ పరోక్షంగా ఆయన హైకమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్ళంరాజు సోనియాగాంధీని కలిసిన అనంతరం మనసు మార్చుకున్నారు. రాజీనామా చేయడం లేదనే సంకేతాలను ఇచ్చారు. పలవురు కేంద్ర మంత్రులు అదే బాటలో పయనించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలి వరకూ పదవులను వీడే విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని భావించిన సీమాం ధ్ర మంత్రుల్లో ఇప్పుడు ఆ ఐక్యత కనిపించడంలేదని తెలుస్తోంది. పైగా విభజనకు కొందరు మంత్రులు సై అంటుంటే మరికొందరు పార్టీ హైకమాండ్‌ నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో చీలిక వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. అయితే రాజీనామాల విషయంలో దాదాపుగా అందరూ వెనక పట్టు పట్టే అవకాశాలు సుస్పష్టమని ఢిల్లీ వర్గాల బో గట్టా.

 

ఇప్పటికే పదవులకు రాజీనామాలు చేసిన మంత్రులు చిరంజీవి తదితరులు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతుండగా, పళ్లం రాజు వంటి వారు మాత్రం ప్రధాని ఆగమన్నారు, సోనియా వద్దన్నారు పునరాలోచన చేయ మంటున్నారని పేర్కొంటూ తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నారా లేక వెనక్కితగ్గారా అన్న దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. ఇలా సీమాంద్ర నేతలు తమ పదవుల కోసం.. ఒక్కొక్కరు మెత్తబడి పోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ బెదిరింపులకు.. తోకలు ముడిచి.. బెంగుళూరు, ఢిల్లీ, హైదారాబాద్ లాంటి నగరల్లోనే తలదాచుకుంటున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల కంటే.. పార్టీ హైకమాండ్ కు మాటలకే విలువ ఇచ్చి, సీమాంద్ర ప్రజలను ఛీ కోడుతున్నారు. అంటే పార్టీని నమ్ముకుంటే.. సీమాంద్రలో కాకపోతే.. తెలంగాణలోనైన కాంగ్రెస్ హైకమాండ్ సీటు ఇచ్చి గెలుపించుకుంటుందనే నమ్మకం సీమాంద్ర నాయకుల్లో బలంగా ఉంది. అందుకే వారు తోకలు ముడిచి .. కాంగ్రెస్ హైకమాండ్ కు .. జై, సీమాంద్ర కు నై అంటున్నారు..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more