రెండు రోజులుగా అట్టుడుకుతున్న విజయనగరం తెలంగాణా మీద క్యాబినెట్ ఆమోదంతో పెల్లుబుకి ఆగ్రహజ్వాలంతా పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మీదకు మళ్ళింది.
శనివారం రాత్రి 10.00 వరకూ ఉద్యమకారులు ఉద్యమిస్తూనే కనిపించారు. బొత్సా సత్యనారాయణ ఇంటిని ముట్టడించటానికి పలుమార్లు ఉపక్రమించగా పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ ఛార్జి, బాష్ఫవాయు ప్రయోగాలు చేసారు.
అంతటికీ కారణం ఆ పార్టీనేనంటూ కాంగ్రెస్ పార్టీ మీద కోపం బాగా పెంచుకున్న ఉద్యమకారులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్సాతోపాటు కాంగ్రెస్ నాయకుడు తమ్మన్నశెట్టి ఇంటి మీద కూడా దాడిచేసారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసారు. అందులోని ఫర్నిచర్ ని తగులబెట్టారు. అవంతి కాలేజ్ కి చెందిన బస్ ని అరుణోదయ స్టీల్ కి చెందిన వ్యాన్ కి నిప్పంటించారు. సోనియా పేరుతో ఉన్న ఒక దుకాణాన్ని కూడా ఉద్యమకారులు ధ్వంసం చేసారు.
అయితే ఉద్యమకారులతో పాటుగా అసాంఘిక శక్తులు కూడా సందుచూసుకుని విజృంభించటంతో ఆదివారం ఉదయం నుంచి విజయనగరంలో కర్ఫ్యూని అమలు చేసారు. 12 దుకాణాల లూటి జరిగింది. దానితో విజయనగరానికి ప్రత్యేక సిబ్బందిని పిలిపించటం జరిగింది. ఐజి తిరుమలరావు శనివారం రాత్రి మాట్లాడుతూ, ఆదివారం నుంచి కర్ఫ్యూ విధించటమైనదని తెలియజేసారు.
పరిస్థితి అదుపులో కనిపిస్తున్నా విజయనగరంలో నివురుగప్పిన నిప్పులా ఉండబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీకరిస్తూ కర్ఫ్యూని అమలుపరచటం జరుగుతోంది. దానితోపాటు విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని కూడళ్ళలో పోలీసులు గట్టి పహరా కాస్తున్నారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగర పట్టణంలో మొదటిసారిగా కర్ఫ్యూ విధించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ గాజుల రేగ లో సత్య ఇంజినీరింగ్ కళాశాల మీద దాడి చేసిన ఉద్యమకారులు ఫర్నిచర్ ని తగులబెట్టారు. మళ్ళీ చెలరేగిన ఉద్రిక్త వాతావరణం పోలీసులకు కునుకు లేకుండా చేస్తోంది. ఆందోళనకారులను చెదరగొట్టటానికి పోలీసులకు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించవలసివచ్చింది.
పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా తయారవటంతో అదుపులోకి తేవటం కోసం షూట్ ఎట్ సైట్ ఆర్డర్లను కూడా పోలీసు అధికారులు ఇవ్వటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more