యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా'. సమంత, శృతి హాసన్ కథానాయికలు. థమన్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ ఆడియో వేదిక మీద వివి వినాయక్, రాజామౌళి, గోపిచంద్, బివిఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, బండ్ల గణేష్, నిర్మాత లగడపాశ్రీదర్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, జూనియర్ భరణిగారు, భరత్ , గిరి, నామాల మూర్తిగారు, చోటకే నాయుడు, భావన, హంసనందిని , తదితరులు హాజరైనారు. ఆడియో ఫంక్షన్ మొదలైననాటిని వేదిక మీద పెట్టిన గదను ఎవరు ఎత్తలేకపోయారు. కానీ యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ఎత్తటం జరిగింది. ఆ సయమంలో .. యాంకర్ ఝాన్సీ తన వాక్ చాతుర్యాన్ని చూపించింది. యంగ్ టైగర్ గద ఎత్తటం చూడటం జరిగింది. అది ఆయన వారసత్వంగా వస్తుంది. , కర్ణుడుగా, భీముడుగా, దుర్యోదునుడా, ఎన్జీఆర్ తరువాత గదను పునికిపుచ్చుకున్న యంగ్ టైగర్ అని ఝాన్సీ చెప్పటం జరిగింది. ఆడియో పంక్షన్ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం చెబుతూ తన మాటలను మొదలు పెట్టాడు. అభిమానులతో కలిసి భారీ ఎత్తున ఫంక్షన్ చేసుకోవాలనే ఇష్టం నాకు ఉంది. కానీ ఒక చిన్న కారణం వల్ల ఇలా చిన్న పంక్షన్ గా చేసుకోవటం జరిగింది. అంటే గతంలోజరిగిన ఒక అవాంచినయ సంఘటన ఇలా ఫంక్షన్ చేసుకోవటం జరిగింది.
అభిమానులు అందరు ఇంటి వద్ద టీవీల్లో చూస్తున్నారు. దీనికి పెద్ద రీజన్ ఏమి లేదు. ఈ చిన్న పంక్షన్ వెనుక ఉన్న రీజన్ ఇదని అభిమానులకు ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. ప్రతి మనిషి తనకు తాను ఆవిష్కరించుకుంటారు. జరుగుతున్న సంఘటనలు బట్టి, చేస్తున్న సినిమాలను బట్టి, ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ బట్టి ప్రతి యాక్టర్ తానను తాను ఆవిష్కరించుకుంటారు. కానీ నన్ను నేను ఎక్కువగా ఆవిష్కరిచటం కంటే.. నా లో ఉన్న టాలెంట్ ను నా దర్శకులు ఆవిష్కరించటం జరిగింది. దాని కంటే ముందుగా ఆ వయసులో ఆది సినిమా చేసి తోడ కొట్టి, నమ్మకం వచ్చేలే చేసింది మా వినయన్న, సింహాద్రితో గొడ్డలతో నరకగలుగుతాను అని నిరూపించాడు మా జక్కన్నా, మీసాలు అప్పటి వరకు తీసి ఎరుగను, అప్పటి వరకు మీసాలు ఎప్పుడు తీయ్యలేదు. నేను బీలివ్ చేసుకునే లా చేసింది మా వంశీ. ఇదేంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వారి పేర్లే చెబుతానని అనుకుంటారా. నేను నటించ గలగుతాను, నేను ఆన్ స్క్రీన్, నేను ఎడవగలుగుతాను, ఆన్ కెమెరా ముందు యాక్టింగ్ చెయ్యగలుగుతాను అని నిరూపించారు రాకీ. అది నేర్పించింది మా దర్శకుడు క్రిష్ణ వంశీ. ఆ తరువాత సన్నగా ఉంటే బాగుంటానని, మళ్లీ ఆవిష్కరించాడు.. మా జక్కన్నా. కామెడీ చెయగలుగుతాను, నాలోని టాలెంట్ ను గుర్తించారు మా వినయాన్. వీరి తరువాత నాకు దొరికిన అత్యంత ఆప్తుడు, నా స్నేహితుడు, దర్శకుడు కంటే స్నేహితుడు ఎక్కువ, ఆప్తుడు ఎక్కువ యూత్ పుల్ గా సినిమా చెయగలగుతాను, హీరోయిన్ వెనక పడి టీజీంగ్ సాంగ్ లు కూడా చెయగలగుతానని చేసిన మా హరిష్ శంకర్ కు నా అభినందనలు అని ఎన్టీఆర్ అన్నారు.
హరీష్ ఈ సినిమా నీకు నచ్చినట్టు వస్తుందా ఎన్నో సార్లు అడగటం జరిగింది. మీకు తెలియాదు టైగర్ .. నాకు నచ్చిన ఎన్టీఆర్ ను ఇందులో చూపెడుతున్నాను.. ఇది నా ఎనిమిది సంవత్సరాల కల అని హరిష్ శంకర్ చెప్పటం జరిగిందని ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. అయితే నేను అతి తక్కువ మందిని అన్నఅని పిలుస్తాను. అలాంటివారిలో జక్కన్న, వినయన్న, రాజన్నా, శిరిష్ అన్నా, ఆది సినిమా నుండి ఇప్పటి వరకు నాకు పరిచయం, అయితే నేను ఏడిస్తే ఏడ్చారు, నేను నవ్వితే నవ్వెరు. ఈ బంధం నేను చనిపోయే వరకు ఉంటుందని ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. సంగీతం దర్శకుడు థామన్ తో ఎన్టీఆర్ 30, కాదు 300 చిత్రాలు చెయ్యాలని కోరుకుంటున్నాని ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. అలాగే కెమెరా మెన్ చోటకే నాయుడు గురించి కూడా చెప్పటం జరిగింది. అలాగే కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో తక్కవగా యాక్ట్ చేసినప్పటి ఆయన బాగ నటించారు. ‘‘ పందాలు.. గుర్రాలు మీద వేసుకోవాలిరా.. సింహాల మీద కాదు ’’ అంటూ ఎన్టీఆర్ తన మాటలను ముగించారు. ఈ సినిమా ఆడియో క్యాసెట్లు .. ఈనెల 24 నుండి మార్కెట్లో దొరుకుతాయి. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ జీవితంలో మంచి హిట్ అవుతుందని అందరు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more