మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ప్రియాంక కలిసి నటించిన సినిమా తుఫాన్ (జెంజీర్ ) ఈ రోజు ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ తో పాటు హీరో వెంకటేష్, శ్రీహరి , తనికేళ్ళ భరణి, అల్లు అరవింద్, దిల్ రాజ్, బండ్ల గణేష్ , వివి వినాయక్, వంశీ పైడిపల్లి, చంద్రబోస్, బివిఎస్ఎన్ ప్రసాద్, తదితరులు ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారు. హాట్ యాంకర్ ఉదయభాను ముద్దు ముద్దు మాటలతో రామ్ చరణ్ తూఫాన్ పై సూనామీ కురిపించింది. అయితే ఈ సినిమాకు అన్ని పాటలు చంద్రబోస్ గారు రాయటం పెద్ద విశేషం. అంతేకాకుండా తూఫాన్ పాటలు అన్ని వర్గాల వారిని మనస్సును తాకే విధంగా చంద్రబాస్ పాటలు రాసినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ను నటుడు తనికెళ్ళ భరణి తన పదునైన మాటలతో మెచ్చుకోవటం జరిగింది. రామ్ చరణ్ చేసింది నాలుగు సినిమాలైన స్వయంక్రుషితో పైకి వచ్చాడని తనికేళ్ల భరణి చెప్పటం విశేషం.
శ్రీహారి సినిమాలకు స్వస్తి చెబుతున్న సమయంలో రామ్ చరణ్ పిలిచి, అపూర్వలిఖియా లాంటి మంచి ప్రేండ్ ను ఇచ్చాడని శ్రీహరి చెప్పారు. అంతేకాకుండా అపూర్వ లిఖియా తీసే ప్రతి సినిమాలో నటిస్తానని శ్రీహరి మాటిచ్చారు. రామ్ చరణ్ కు శ్రీహరి థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఇక హీరో విక్టరీ వెంకటేశ్ రామోజీ ఫిలింసీటీలో బీజిగా ఉన్నప్పటికి రామ్ చరణ్ ఫోన్ చెయ్యగానే.. తూపాన్ ఆడియో ఫంక్షన్ రావటం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా అందరికి థ్యాంక్స్.. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్ అన్నయ్యకు థ్యాంక్స్.. చిన్నప్పడు అంకుల్ అనే వాడిని, ఇప్పుడు నాకు అన్నయ్యలాగా ఉన్నారు అని వెంకటేశ్ గురించి రామ్ చరణ్ చెప్పారు. ఈ సినిమా పై చాలా మంది చాలా అన్నారు. రామ్ చరణ్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని ఫ్యామిలీ సభ్యులు, మరికొంతమంది రామ్ చరణ్ అడిగినట్లుగా చెప్పటం జరిగింది.
ఇలాంటి సాహసం ఎందుకు చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకోమని చాలా మంది సలహాలు ఇవ్వటం జరిగింది. అయితే అప్పుడు అపూర్వలియా గారు ఎనిమిది నెలల నుండిఫోన్ చేస్తునే ఉన్నారు. అయితే ఒక రోజు అపూర్వలిఖియా చెప్పిన స్ర్కిఫ్ట్ వినటం జరిగింది. అప్పుడే చాలా బాగా నచ్చింది. అయితే వెంటనే ఈ విషయం నాన్న ( చిరంజీవి) గారితో చెప్పటం జరిగింది. అమితాబచ్చన్ నటించిన సినిమా. మళ్లీ చెయ్యలంటే భయంగా ఉందని చెప్పటం తో నాన్నగారు ఒక్కటే చెప్పటం జరిగింది. స్ర్కిప్ట్ నచ్చకపోతే వదిలేయ్. అంతేకానీ.. భయంతో మాత్రం సినిమా వదిలేయ్ కు అని చెప్పటం జరిగింది. అయితే ఇప్పటికే బాలీవుడ్ కు వెళ్లిన వెంకీ అన్నయ్య, నాగార్జున్ గారు, నాన్నగారు మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.
అయితే నేను ఏదో సంపాదించాలి, బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ అవుతానని నేను ఈ సినిమా చెయ్యలేదు. ఇది ఒక సరికొత్త ప్రయోగం మాత్రమే. మేము చేసే ప్రయోగాలకు ప్రాణం పోసేది అభిమానులే, నాన్నగారు ప్రోత్సహం, బాబాయ్ నేర్పించిన నటనతో నేను ఈ సాహనం చెయ్యటం జరిగిందని రామ్ చరణ్ మెగాఅభిమానులకు చెప్పటం జరిగింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 6వతేదిన విడుదల అవుతుందని రామ్ చరణ్ చెప్పటం జరిగింది. అయితే చివరిగా అందరికి మరో సారి థ్యాంక్స్ అంటూ.. చివరిగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా .. జైహింద్ అంటూ రామ్ చరణ్ తన స్పీచ్ ను ముగించారు. మెగా అభిమానులు ఆనందతో.. తూఫాన్ పాటల వర్షంలో తడుస్తూ .. ఇంటి బాట పట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more