విభజనపై పార్టీ తీసుకున్న నిర్ణయంలో యూటర్న్ తీసుకునేది లేదని ఇదివరేక నిస్పష్టం చేసిన బాబు... నిర్ణయం అనంతరం సీమాంధ్ర ప్రజల నుంచి వెల్లువెత్తిన ఆందోళన, రాజధాని, జలవనరులు, ఉద్యోగాలు విషయంలో తలెత్తిన అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయాల్సింది కేంద్రమే అంటూ ప్రజాక్షేత్రం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వత్తిడి చేయనున్నారు. రాష్ర్ట విభజనపై కాంగ్రెస్ నిర్ణయం వెలువడిన అనంతర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర పేరిట జనం దగ్గరకు చేరువయ్యే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నుంచే తిరుపతి వేదికగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. బాబు బస్సు యాత్రతో కాంగ్రెస్ గుండెల్లో అలజడి మొదలయ్యింది. మరో ప్రక్క బాబు ఏ నిర్ణయం తీసుకొంటారో తెలియక అయోమయంలో ఉన్న భారతీయ జనత పార్టీ బాబు నిర్ణయం కోసం వేచి చూసే దోరణితో ఉంది...ఇటు మోడీ ప్రభంజనం అటు బాబు చరిష్మాతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. వీరిద్దరి కలయిక ఇటు రాష్ట్రానికి అటు దేశానికీ అవసరం...ఇద్దరు నేతలు విజన్ ఉన్న నేతలే కావటం గమనార్హం. అయితే 2000పై చిలుకు కి.మీ.లు సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం మిగిలిన జిల్లాలలో బస్సు యాత్ర చేపట్టాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టాల్సి వుంది. మరి మారిన పరిస్థితుల్లో తెలుగు ఆత్మగౌరవ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను పాదయాత్ర చేయకుండా మిగిలి వున్న జిల్లాలకు పరిమితం చేస్తారా, అన్ని జిల్లాలలో కొనసాగిస్తారా అనేది త్వరలో తేల్చనున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more