తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంద్ర ఉద్యోగులు వెళ్లిపోవాలి అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు సీమాంధ్రలో నిరసన సెగలు రేగాయి. సీమాంద్ర నాయకులు కేసిఆర్ మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కేసిఆర్ మాటలు తెలంగాణ విద్యార్థుల మీద ప్రభావం చూపింది. తెలంగాణ విద్యార్థులు తీసుకున్న నిర్ణయానికి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదువుల నిమిత్తం ఆంధ్రప్రాంతంలోని వివిధ పట్టణాల్లో ఉంటున్న తెలంగాణ విద్యార్ధులు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్రలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాల్ని భరించలేక వాళ్లంతా వెనక్కి వచ్చేస్తున్నారనుకుంటే పొరపాటే. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నందున స్ధానిక విద్యార్ధులనిపించుకోవడానికే వీళ్లంతా సొంతప్రాంతాలకు మరలుతున్నారని తెలుస్తోంది. ఎంసెట్ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ని ఏ ప్రాంతంలో పూర్తి చేస్తారో...ఆ ప్రాంతాన్ని స్థానికంగా భావించి సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదివినా ఎంసెట్ సీట్ల కేటాయింపులో స్థానికంగానే పరిగణించేవాళ్లు. అయితే, ఆరునెలల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటవుతోందనే స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ను తమ కొత్త రాష్ట్రంలోనే పూర్తిచేయాలనే భావంతో ఆంధ్రప్రాంతంలో వివిధ పట్టణాల్లోని కాలేజీల్లో చదువుతున్న సుమారు 50 వేలమంది విద్యార్ధులంతా స్వస్ధలాలకు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని జూనియర్కాలేజీ లెక్చరర్ల అసోసియేషన్ ప్రతినిధి పి. మధుసూధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర పట్టణాలనుంచి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, పట్టణాల్లోని నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చాలామంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. 2014 ఎంసెట్ కోసం తెలంగాణ 10 జిల్లాల్లోనుంచే ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులవ్వాలనే ఉత్సాహంతో వీళ్లంతా తెలంగాణ బాట పట్టారు. వీరి రాకతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేసిఆర్ వ్యాఖ్యలు తమ విద్యార్థులపై ప్రభావం చూపించిందని వారు వాపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more