మూడురోజుల్లో తెలంగాణా రాష్ట్రాన్నివ్వచ్చని, పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపితే మరో మూడు రోజుల్లో పని పూర్తైపోతుందని, ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్ర విభజనను ప్రకటించిందనే అపవాదు మోయకుండా ఉండాలంటే మొదలుపెట్టిన పనిని పూర్తిచేసి చూపించాలని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావ్దేకర్ సూచించారు.
శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన జావ్దేకర్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే, తెలంగాణా సమస్య కారణంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందనే భయంతోనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి సై అన్నారని అన్నారు.
అయితే తెలంగాణా సమస్యను పరిష్కరించటంలో కాంగ్రెస్ తీసుకున్న తికమక చర్యలు సీమాంధ్రలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని జావ్దేకర్ అన్నారు. అందులోనూ రాష్ట్ర వేర్పాటుకు పట్టే సమయాన్ని కాంగ్రెస్ నేతలు రకరకాలుగా చెప్తూ ప్రజలను ఇంకా అయోమయ స్థితిలోకి నెట్టివేస్తున్నారని అన్నారాయన. మొదట్లో దిగ్విజయ్ సింగ్ నాలుగు నెలలు పడుతుందంటే గులామ్ నబీ ఆజాద్ ఐదు నెలలని, సుశీల్ కుమార్ షిండే ఆరునెలలని చెప్తున్నారని చెప్తూ, ఆ మధ్య నెలంటే 30 రోజులు కాదన్న ఆజాద్ మాటలను కూడా ఆయన గుర్తుచేసారు.
భాజపా అధికారంలోకి వచ్చిందంటే 100 రోజుల్లో తెలంగాణా ఇస్తుందని చేసిన వాగ్దానం వలన భయపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా పావులను చకచకా కదుపుతూ తెలంగాణా ప్రకటన చేసిందని, అయితే దాన్ని పూర్తి చెయ్యాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని, ఆ పని పూర్తి చేస్తేనే కాంగ్రెస్ కి తెలంగాణా ప్రజల సద్భావన లభిస్తుందని ప్రకాశ్ జావ్దేకర్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more