జరుగుతున్న పరిణమాలను చూస్తే అవుననే అంటున్నారు టాలీవుడ్ వాసులు. టాలీవుడ్ కు పవర్ లాంటి వ్యక్తి సడన్ గా ఇలాంటి మార్పులు జరుగుతాయని ఎవరు ఊహించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయంలే అందుకు అద్దం పడుతున్నాయి. ‘ఆత్తారింటికి దారేది ’ ఆడియో ఫంక్షన్ , మెగా అభిమానులు సాక్షిగా జరిగిన విషయలే ఇందుకు నిదర్శనం అని టాలీవుడ్ లో బడా బాబులు అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాన్ మరో చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా అక్కడ నుండి పవన్ పై రాజకీయ నాయకుల కన్ను పడింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ మంతనాలు జరుగుతున్నాడని, త్వరలో టిడిపిలోకి చేరుతాడనే పుకార్లు సిగ్నల్ టాలీవుడ్ టవర్ నుండి అభిమానుల మెబైల్స్ అందుతున్నాయి. ఇంక సిగ్నల్ దొరకని వారు ఫిలింనగర్ గణపతి కాంప్లెక్స్ వద్ద జరిగే పుకార్ల సదస్సుకు హాజరైనట్లు ఫిలింనగర్ కోడై కూస్తుంది.
అయితే అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ తరువాత నుండి పరిస్థితులు మారిపోయినట్లు సమాచారం. గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉన్న సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అత్తారింటికి దారేది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ తో మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పూరి, త్రివిక్రమ్ లు మంచి స్నేహితులని టాలీవుడ్ లో చెప్పుకుంటారు. పవన్ కళ్యాన్ పర్సనల్ విషయాల్లోకి వెళ్లి, పెద్దన్నా పాత్ర పోషిస్తున్న త్రివిక్రమ్ పవర్ కళ్యాన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసే ఆలోచనల్లో ఉన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఆ ఉద్దేశంతో ఆడియో ఫంక్షన్ వేదిక మీద పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ నాలుగు ముక్కలు ఎక్కువ చెప్పినట్లు వినికిడి. పవన్ కళ్యాణ్ కూడా తన కు అన్ని త్రివిక్రమ్ అనే అనటంతో పరిస్థితి ఎంతో దూరంలో వెళ్లిందో ఇట్టే అర్థం అవుతుందని సినీజనాలు అంటున్నారు. ఈ పుకార్లలన్నింటి బలం చేకూర్చే విధంగా మరో ప్రయోగం ఉందని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.
ఇటీవల నటుడు రవితేజ్ కు బలుపు పెంచిన నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) మరో కారణం అని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పివిపి సంస్థ నిర్మాణంలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీని గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. పివిపి జగన్మోహన్ రెడ్డి పార్టీ లో చాలా ముఖ్యమైన వ్యక్తి గా అందరికి తెలుసు. అయితే పవన్ స్టార్ పివిపి తో సినిమా చెయ్యటం విశేషంగా ఉందని అభిమానులు , రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా రాజకీయ ప్రయోజనాల కోసమే పవర్ స్టార్ సినిమా చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తరువాత పవన్ రాజకీయలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటు పవన్ పాలోయింగ్ ను, అటు జగన్ పాలోయింగ్ ను పార్టీకి ఉపయోగించే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ఉంటుందని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే.. పవన్ పవర్ పై వైసీపీ టార్గెట్ పెట్టినట్లు సమాచారం. అయితే పవర్ స్టార్ మాత్రం 2014 ఎన్నికలో ఏ రాజకీయ పార్టీ పవర్ అందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more