వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాద్యక్షరాలు వైఎస్ విజయమ్మ విజయం సాధించారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్ని విమర్శలు చేసిన వాటిని లెక్క చెయ్యకుండా ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యటమే ఆమె దీక్షగా పెట్టుకుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మొట్ట మొదటి మహిళగా రాష్ట్ర ప్రజల మదిలో వైఎస్ విజయమ్మ నిలిచిపోయింది. రీసెంట్ వైఎస్ విజయమ్మ ఫిజు రిఇంబర్స్ పై దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విజయమ్మ చేసిన రెండు రోజుల ధీక్షకు అనుహ్యమైన స్పందన వచ్చింది. ఆమె దీక్షకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి, కాలేజీ యాజమాన్యల నుండి మద్దతు లభిచింది. కొన్ని రాజకీయ పార్టీ లు కూడా వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతు తెలపటం జరిగింది. ఒక్కసారిగా వైసీసీ పార్టీ కి ప్రజల మద్దతు పెరిగిపోవటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కన్నుకుట్టుంది. వైఎస్ విజయమ్మ దొంగ దీక్ష చేస్తున్నారని, కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాయడానికే విజయమ్మ దీక్ష చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కేడీ నాయకులు విమర్శలు చేయ్యటం మొదలుపెట్టారు. విజయమ్మ చేతి వంట తిన్న బొత్స లాంటి వారు కూడా కిలాడి విమర్శలు చేసి.. విజయనగరంలో నవ్వులపాలైనట్లుగా వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా చిన్నారులు ఉన్నత విద్యను అభ్యసించాలనే అకాంక్షతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఇంబర్స్ మెంట్ ను ప్రారంభిస్తే .. ఆయన పథకాలను తూట్లు పొడుస్తున్న ప్రస్తుత ప్రభుత్వాలు , విద్యార్థుల ఆత్మహత్యలను ప్రేరేపించేలా దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఇందిరాగాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్ష విజయవంతం కావటంతో కాంగ్రెస్ నాయకుల్లో కలకలం పుట్టి ఆమె విమర్శలు చెయ్యటానికి మీడియా ముందు కు ముగ్గురు మంత్రులు పోటీపడ్డారు. సారయ్య, పితాని సత్యనారాయణ, బాలరాజు లాంటి వారు వైఎస్ విజయమ్మ మీద విమర్శలు చెయ్యటానికి పోటీపడ్డారు. ఆమె చేసిన దీక్ష సక్సెస్ అయిన సందర్భంగానే కాంగ్రెస్ నాయకుల్లో కలకలం రేగి ఇలా రోడ్డుపడ్డారని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ విజయమ్మ కంట్లో నలుసు మాదిగా తయరైందని గాంధీ భవన్ లో వైఎస రాజశేఖర్ అభిమాన నాయకులు చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more