సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించేందుకు తలపెట్టిన ఈ సభను సీమాంధ్రనేతలు అకస్మాత్తుగా వాయిదా వేయడానికి పార్టీ అధిష్టానం ఆదేశాలే కారణమని తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్వహించ తలపెట్టిన అనంతపురం సభ వాయిదా పడింది. ఈ నెల 16న జరగాల్సిన ఈ సభను తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి సాకే శైలజానాథ్ అనంతపురంలో ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ అంశంపై కోర్క మిటీలో సీఎం కిరణ్కుమార్రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందించిన రోడ్మ్యాప్లను పరిశీలించిన పార్టీ అగ్రనేతలు సీడబ్ల్యూసీలో చర్చించాలని నిర్ణయించడం తెలిసిందే. కోర్ కమిటీ సమావేశం రోజునే సమైక్య సభను నిర్వహించాలని సీమాంధ్ర నేతలు తొలుత నిర్ణయించుకున్నా.. ఆ రోజున అందరూ ఢిల్లీలో ఉండాల్సిన అవసరమున్నందున 16న సభ నిర్వహించాలని భావించారు.
కానీ, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆ సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. పార్టీ అధిష్టానం పెద్దలు అనుమతించనందునే ఈ సభ వాయిదా పడిందన్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యపై పార్టీ ఒక నిర్ణయం తీసుకొనేందుకు నిర్ణయించినందున ఈ సమయంలో.. సభలు, సమావేశాలు వద్దని అధిష్టానం సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. కోర్ కమిటీ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో ‘తెలంగాణ సాధన సభ’ను భారీగా నిర్వహించారు. దానికి అభ్యంతరం చెప్పని అధిష్టానం తమ సమావేశం విషయంలో భిన్నంగా వ్యవహరించడంలోని ఆంతర్యం అర్థంకాక సీమాంధ్ర నేతల్లో గుబులు రేగుతోంది. పార్టీ అధిష్టానం తెలంగాణపై ఒక నిర్ణయానికి వచ్చేసిందా? అనే అనుమానాలు వారిని వెన్నాడుతున్నాయి.
కోర్ కమిటీ భేటీ అనంతరం పార్టీ అధిష్టానం ఒక ప్రకటన చేయవచ్చని ప్రచారం జరిగినా.. ఎలాంటి ప్రకటన చేయకుండా నిర్ణయాన్ని సీడబ్ల్యూసీకి వదిలిపెట్టడంతో సీమాంధ్ర నేతలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడినా సీడబ్ల్యూసీ సమావేశంలో ఏం జరగబోతుందనేదానిపై మాత్రం వారిని అనేక సందేహాలు వెన్నాడుతున్నాయి. కానీ, పంచాయతీ ఎన్నికలతో పాటు, వర్షాలతో వ్యవసాయపనులు ఊపందుకున్నాయని... ఇలాంటి సమయంలో సభలు నిర్వహించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే వాయిదా వేసుకున్నామని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more