నిన్న సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయకులు సంఘటన స్థలానికి వచ్చి, రాజకీయ స్పీచ్ లు ఇచ్చివెళ్లారు. అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యే సినీ జయసుధ మాత్రం సిటీలైట్ ఘటన స్థలం వద్దకు రాలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ జయసుధ పై విమర్శలు చేయటం జరిగింది. సికింద్రాబాద్ లో ప్రమాదం జరిగిన కూడా ఎమ్మెల్యే జయసుధ రాకపోవటం పై తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. సంఘటన స్థలం వద్ద తలసాని విమర్శలు అక్కడివారికి కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. కానీ ఎమ్మెల్యే జయసుధ మాత్రం తలసాని శ్రీనివాస్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
అంతేకాకుండా సిటీలైట్ తన పరిదిలోకి రాదని చెప్పి ..తప్పించుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అనేసరికి తన ఒక్క నియోజకవర్గమేనని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారని జయసుధ అన్నారు. అటు కంటోన్మెంట్, ఇటు సనత్నగర్ నియోజకవర్గాలున్నాయని, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏది జరిగినా తన నియోజకవర్గమేనని అంటే ఎలా అని ఆమె అన్నారు. తన నియోజకవర్గం అయినా కాకపోయినా దుర్ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషిగా తాను స్పందిస్తానని ఆమె అన్నారు. హోటల్ కూలిందని తెలియగానే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శిశిధర్ రెడ్డితో తాను మాట్లాడినట్లు ఆమె తెలిపారు.
ఇలాంటివి సహజంగా పోలీసు స్టేషన్ల మద్య ఉంటాయి. ఆ కేసు మా పరిదిలోకి రాదు అంటూ.. పక్కనున్న పోలీస్ స్టేషన్ వెళ్లండని, బాధితులకు ఉచిత సలహా ఇచ్చి, ఆకేసు ను తప్పింకుంటారు. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల కూడా జరిగిన ఘటన నా పరిధిలోకి రాదని తప్పించుకోవటం ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. సంఘటన స్థలానికి వెళ్లి, బాధితుల గోడు వినకుండా, ఇతర పార్టీలపై రాజకీయ విమర్శచాలు చెయ్యటం కూడా మంచిదికాదు.. చేతనైతే .. సాయం చెయ్యండి? అంతేకానీ బాధితుల గోడుతో రాజకీయాలు చెయ్యకండని బాధితుల బందువులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more