వేల ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఆపన్నహస్తాలకోసం పదిరోజులుగా ఎదురుచూస్తున్నాయి. అక్కడే వరదబాధితుల సహాయ చర్యలకోసం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని వందల మంది వీరసైనికులు ప్రాణాలకు తెగించి అనంత ప్రకృతితో పోరాడుతున్నారు. అక్కడ హెలికాప్టర్ ప్రమాదాల్లో సహచరులను పోగొట్టుకుంటున్నా మొక్కవోని దీక్షతో ఆపన్నులను ఆదుకుంటున్న సైనికుల త్యాగపూరిత ఆచరణ.. ఇక్కడేమో మనదీ ఒక బ్రతుకేనా అనే మహాకవి కవితా చరణాలను అక్షరాలా నిరూపిస్తూ మన నేతల వికృత చేష్టలు తెలుగు ప్రజల గౌరవాన్ని ఏడు నిలువుల గొయ్యిలో పాతరేస్తున్నాయి. ఏ సత్కార్యమైనా, మహత్కార్యమైనా సరే రాజకీయాలు దూరితే ఎంత వికృత స్వభావాన్ని సంతరించుకుంటాయో మన నేతలు డెహ్రాడూన్ విమానాశ్రయం సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్పేశారు.రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలు తమ పద్ధతి ఏ మాత్రం మార్చుకోలేదు.. రాష్ట్రం మారినా, తమ విధానం మారదని నిరూపించారు.. ప్రతి విషయంలోనూ పై చేయి సాధించి మార్కులు కొట్టేయాలని భావించే ఇరు పార్టీల నేతలు చివరకు.. ఉత్తరాఖండ్ బాధితులను తరలించే విషయంలోనూ బుద్ధి మార్చుకోలేదు. తాము ఏర్పాటు చేసిన విమానంలోనే బాధితులు ఎక్కాలంటూ పట్టుబట్టి, చివరకు తన్నుకునే వరకూ పరిస్థితిని తీసుకెళ్లారు.
ఎయిర్ పోర్టు సాక్షిగా రాష్ట్ర పరువును 'మందాకిని' నదిలో నిమజ్జనం చేశారు. ఈ ఘనత సాధించింది సామాన్య కార్యకర్తలు కాదు.. పార్లమెంట్ సభ్యులుగా కీర్తినందుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, టిడిపి ఎంపీ రమేష్ రాథోడ్. జనం చూస్తుండగా.. పోలీసులు వారిస్తుండగా.. టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ముష్టిఘాతాలు కురిపించుకునే వరకూ వెళ్లారు.ఒకరినొకరు తోసుకున్నారు. తిట్లదండకం అందుకున్నారు. 'మీది శవరాజకీయమని ఒకరంటే, మీది నీతిమాలిన రాజకీయం' అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. చివరకు ఆర్మీ సిబ్బంది, ఎయిర్ పోర్టు అధికారులు సర్ది చెప్పడంతో శాంతించారు. అన్ని రాష్ట్రాల నేతలూ తమ వారి భద్రత కోసం తపిస్తుండగా.. మన ప్రజాప్రతినిధులు మాత్రం ఈ విపత్తును భవిష్యత్ రాజకీయ మనుగడ కోసం ఉపయోగించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. భయానక వరద ముప్పులో చిక్కుకుని పదిరోజులపాటు నిద్రాహారాలకు దూరమై, అష్టకష్టాలు పడిన యాత్రికులను ఆదుకోవడంలో పార్టీలకతీతంగా స్పందించాల్సిందిపోయి.. వారిని కాపాడిన ఘనత మాకు దక్కాలంటే మాకు దక్కాలని పోటాపోటీలు పడటం.. ప్రజాప్రతినిధులం అన్నమాట మరచి వాదులాటలకు, తోపులాటలకు దిగడం దారుణం. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ దుస్థితిని చూసి మరింత ఆవేదనకు లోనవడం సగటు తెలుగు బాధితుని వంతయ్యింది
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more