కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వెండి తెరమీదే కాకుండా, ప్లబిక్ లో కూడా సంచలనం రేపుతున్నాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో అడుగు పెట్టిన రామ్ చరణ్ పేరు ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా మారుమోగిపోతుంది. రామ్ చరణ్ కు ‘మగదీర ’ ఫ్యాన్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులతో ప్రపంచం మొత్తం నిండిపోయిందనటానికి ఇదే నిదర్శనం. రామ్ చరణ్ తేజ జపాన్లో సైతం సంచలనం సృష్టించారు. అక్కడి ఒక ప్రముఖ కంపెనీ తాము తయారు చేసే బిస్కెట్లకు ఆయన పేరు పెట్టి ఆ ప్యాకెట్లపై ఆయన బొమ్మ ముద్రించింది. రామ్ చరణ్ తేజ నటించి న సూపర్ హిట్ చిత్రం మగధీర ఇటీవల జపాన్ సబ్ టైటిల్స్తో అక్కడ విడుదలైంది. అక్కడ కూడా హిట్ అయింది. దానితో ఆయనకు అక్కడ ఉన్న ప్రజాదరణను గౌరవించే ఉద్దేశంతో ఆ బిస్కెట్ కంపెనీ చరణ్ లవ్ పేరుతో క్రీమ్ బిస్కెట్లను విడుదల చేసింది. భారతీయ చిత్రాలకు ఎక్కువ ప్రజాదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. అక్కడ ఎక్కువ ప్రజాదరణ ఉన్న భారత నటుల్లో రజనీ కాంత్ ఒకరు. ఇటీవలి కాలంలో రామ్ చరణ్ తేజ అక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి అభిమానుల నుంచి ఆయనకు పెద్దఎత్తున ఈ మెయిల్ సందేశాలు అందుతున్నాయని తెలిసింది. జపాన్ లో మెగా అభిమానులు తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more