వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒక విచిత్ర మైన ప్రయోగం చేశారు. సమాచార హక్కు చట్టం కింద మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆస్తుల వివరాలు రాయసాటి సేకరించినట్లు సమాచారం. అయితే రాయపాటి చేతిలో మంత్రి కన్నా ఆస్తుల వివరాలు ఉండటం పై కన్నావర్గం వారు మండిపడుతున్నారు. అంతేకాకుండా గుంటూరు కాంగ్రెస్ పరువు బజారునపడిందని, మంత్రి కన్నా వర్గం వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో రాయపాటి సాంబశివరావు మంత్రి కన్నా పైకి ఒంటి కాలు మీద దూకుతున్నాడు. రీసెంట్ గా జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన విషయంలో సిబిఐ వారు కొంతమంది మంత్రులును విచారించిన విషయం తెలిసిందే.
అయితే వారిలో మంత్రి కన్నా పేరు ఉండటంతో.. ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా’రాయపాటి రెచ్చిపోయి మీడియ ముందు ప్రకటనలు చేయ్యటం జరిగింది. కళంకిత మంత్రులను వెంటనే తొలగించండని కాంగ్రెస్ అధిష్టానానికి రాయపాటి సలహా ఇవ్వటం. అవినీతి మంత్రులు వలన పార్టీ కి నష్టం జరుగుతుందని సూచించారు. కన్నా పై రాయపాటి ప్రత్యర్థి పోరు ఎప్పటి నుండో జరుపుతునే ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ రాయపాటి మంత్రి కన్నా ఆస్తుల వివరాలు సేకరించట పై గుంటూరు కాంగ్రెస్ నాయకుల మద్య యుద్ద వాతావరణం నెల్పకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే పార్టీ పరువు తీస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
రాయపాటి వ్యవహరిస్తున్న తీరుపై హైదరాబాద్ గాంధీ భవన్ లో సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. రాయపాటి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయపాటి సమాచార హక్కు చట్టం కింద, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆస్తుల వివరాలు పొందటం వలన ప్రతిపక్ష పార్టీలకు బలం చేకురుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ నాయకుల విషయం పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more