తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టి పుష్కర కాలం అయ్యింది. ఈ పుష్కర కాలంలో ఆ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ద్వేయంతో ముందుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు వివాదాల సుడిగుండాల్లో చిక్కుకుంది. పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారస్థాయికి చేరి నడిరోడ్డు పై నాట్యం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శలు దాడి చేస్తున్నారు ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురైన నేతలు. మొన్న రఘునందన్ రావు టీఆర్ఎస్ పార్టీ పై చేసిన, విమర్శలు ప్రజలు మరిచిపోలేదు . టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన చింతా స్వామి మాదిగ ఆ పార్టీకి చావుడబ్బా మోగించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తనను కులం పేరుతో దూషించారంటూ చింతా స్వామి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, చింతా స్వామి తెలంగాణ భవన్ ఎదుట చావుడప్పు మోగించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆందోళనకారులపై తెరాస శ్రేణులు దాడికి దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ ఉద్యమాన్ని వ్యాపారం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ భవన్ ముందు చావు డప్పు మోగిస్తామని చింత స్వామి అంతకుముందే ప్రకటించారు.
దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ ముందున్న రోడ్డుకు రెండువైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయినప్పటికీ చింతాస్వామి అక్కడకు చేరుకుని చావుడప్పు మోగించి అందరినీ విస్మయపరిచాడు. అయితే కేసిఆర్ పై అనేక చోట్ల కేసులు పరంపరలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ పై కేసిఆర్ విమర్శలు చేసినందుకు గాను ఒక న్యాయవాది కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును మరిచిపోకముందే. కేసిఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాదిగలు దూరం అయ్యారనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. ఇప్పటికే మాదిగ దండోర నాయకుడు మంద క్రిష్ణ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చింతాస్వామి కేసిఆర్ పై పెట్టిన కేసుతో.. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ బాగం దళిత నాయకులే ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చింతాస్వామి పెట్టిన కేసు , కేసిఆర్ పై ఎక్కువ ప్రభావం చూపుతుందని పార్టీలోనే సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more