అవినీతి పరులకు, జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముద్దాయిలకు టీటీడీ అధికారులు సకల మర్యాదలు చేయడంలో ముందుంటారని మరో సారి నిరూపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ2 నింధితుడు, జగతి పబ్లికేషన్స్ ఛైర్మెన్ అయిన విజయసాయి రెడ్డి తిరుమలలో తన పవర్ ని చూపించారు. జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఈయన తన కుమార్తె పెళ్ళి నిమిత్తం బెయిల్ పై విడుదల అయి, మళ్ళీ రేపో, మాపో జైలుకు వెళ్లబోతున్న ఈయన వివాహం తరువాత కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఆలయ అధికారులు సకల మర్యాదలు చేశారు. ఈయన దర్శనం కోసం, ఎల్ 1 కింద (వీవీఐపీలలో అత్యంత ఉన్నతమైన స్థానం) తెల్లవారు జామున 5.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. అప్పుడు ప్రవేశించిన ఆయన తిరిగి 8.30 గంటలకు బయటకు వచ్చారు. ఈ మూడు గంటలు లోపల ఏం చేశారని ఆరా తీస్తే... ప్రముఖ స్థలం అయిన రంగనాయక మండపంలో విజయసాయి రెడ్డి తన మనవడికి అన్న ప్రాసన చేయించారు.
మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రస్తుతం ఖైదీ అయిన విజయసాయి రెడ్డి ధనహంకారానికి టీడీటీ అధికారులకు టీటీడీ యంత్రాంగం సాగిలపడి సకల మర్యాలు చేసి, సామాన్య భక్తులను మరిచింది. ఈ తంతు దాదాపు మూడు గంటల పాటు జరిగింది. దీంతో సామాన్య జనం అనేక ఇబ్బందులు పడ్డారు. రంగనాయకుల మండపంలో అన్నప్రాసన చేయించడం ఇది నిబంధనలకు విరుద్ధం. 1987లో ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో సినీనటుడు బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణికి రంగనాయకుల మండపంలో అన్నప్రాశన చేయగా, అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఈ చర్యను పీఠాధిపతులు తప్పుబట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం పై పెద్ద దుమారం చెలరేగింది. ఆ తరువాత నుండి నిబంధనలను మరింత కఠినం చేశారు. ఆ తరువాత నుండి అక్కడ అన్నప్రాసన చేయించడానికి ఎవరూ సాహసించలేదు. మొత్తానికి విజయసాయి రెడ్డి తన స్టైల్లో టీటీడీలో రాజభోగాలు అనుభవించారని అంటున్నారు. దీని పై టీటీడీ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more