1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఆయన ఈ నెల 16వ తేదీలోగా లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటికే రివ్యూపిటిషన్ను, నిర్మాతల పిటిసన్ను కూడా కోర్టు తిరస్కరించింది. ఓ మారు నెల గడువు ఇచ్చాక మరోమారు రివ్యూ పిటిషన్ వేసినా సంజయ్ దత్కు ఊరట దక్కలేదు. దత్ దరఖాస్తుపై న్యాయమూర్తి జిఎ సనప్ రిప్లై దాఖలు చేయాలని సిబిఐని అదేశించారు. సంజయ్ దత్ దరఖాస్తుపై విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అయితే సంజయ్ దత్ కు ప్రాణభయం ఉందంటే బాలీవుడ్ నటుడు సందజ్ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులతో తనకు ప్రాణహాని ఉందన్నారు. గడువు దగ్గర పడడంతో పూణేలోని యెరవాడ జైలులో లొంగిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని సంజయ్ దత్ టాడా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున, సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ సాల్వి కోర్టుకు హాజరయ్యారు. లొంగిపోవడానికి మరింత గడువు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన వెంటనే సంజయ్ దత్ టాడా కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ 42 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది.
1993 ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించడానికి లొంగిపోయేందుకు మరింత గడువును ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సంజయ్ దత్తో సినిమా తీస్తున్న ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా లొంగిపోయేందుకు సంజయ్ దత్కు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ దత్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇదివరేక తోసిపుచ్చింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు ఎదురు దెబ్బ తగిలింది. 1993 వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు మే 10వ తేదీన సంజయ్ దత్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇతర ఆరుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more