ప్రస్తుతం నాగార్జున తో భాయ్ చిత్రం చేయబోతున్న పూలరంగడు దర్శకుడు వీరభద్రమ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈయన తన తరువాతి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని, ఈ మధ్యనే ఎన్టీఆర్ కి స్టోరీ ని కూడా వినిపించాడని, అది ఆయనకు నచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘భయ్యా ’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలకు కమీట్ అయిన జూనియర్, హరీశ్ శంకర్ దర్శకత్వంలోని రూపొందే సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తరువాత కందిరీగ దర్శకుడితో ‘రభస ’ సినిమా ఉంటుంది. ఈ రెండు చిత్రాల తరువాత ‘భయ్యా ’ చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనుకున్న బాద్షా అంతగా హిట్ కాకపోవడంతో జూనియర్ ఆచితూచి దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడని, ఈ నేపథ్యంలో వీరభద్రమ్ కి ఆఫర్ వస్తుందో లేదో చూడాలని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more