భారతీయ చలన చిత్రసీమ శతవసంతాల వేడుకను పూర్తి చేసుకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తపాలా బిళ్లలు విడుదల చేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలతో తపాలా బిళ్లలను రూపొందించడం ఎప్పట్నుంచో చూస్తున్నదే. ఆ కోవలో భారతీయ సినీరంగానికి చెందిన ఎందరో ప్రముఖుల స్మారక తపాలా బిళ్లలు విడుదలైన సంగతి తెలియంది కాదు. దేశవ్యాప్తంగా వివిధ సినీరంగాలకు చెందిన 50 మంది సినీ ప్రముఖుల తపాలా బిళ్లలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందదాయకమని దక్షిణభారత ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లోని ఫిలించాంబర్ ఏర్పాటుచేసిన సమావేశంలో సి.కల్యాణ్ మాట్లాడుతూ, ఉత్తర భారతానికి చెందిన 41 మంది సినీ ప్రముఖులు, దక్షిణ భారతానికి చెందిన 9 మంది సినీ ప్రముఖుల ఫోటోలతో ఈ స్టాంపులను ప్రభుత్వం విడుదల చేయనున్నదని ఆయన చెప్పారు.
ఇందులో భాగంగా తెలుగు సినీరంగం నుంచి ఎస్వీ.రంగారావు, భానుమతి, అల్లు రామలింగయ్య, తమిళ రంగం నుంచి నగేష్, కన్నదాసన్, సి.వి.శ్రీధర్, టి.ఆర్.సుందరం, కన్నడ రంగం నుంచి విష్ణువర్ధన్, మలయాళం నుంచి ప్రేమ్నజీర్ల తపాలా బిళ్లలను ముద్రించేందుకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసిందని అన్నారు. జూన్లో అధికారికంగా ఈ స్టాంపులు విడుదలవుతాయని అదే మాసంలో వారి కుటుంబాలను కలుపుకుని ఓ వేడుకను నిర్వహించబోతున్నామని కల్యాణ్ తెలిపారు. కాగా తాము సూచించిన పేర్లలో రఘుపతి వెంకయ్య పేరు కూడా ఉన్నదని, అయితే ఆయన పేరుతో స్టాంపు రూపకల్పనకు ప్రస్తుతం అనుమతి లభించలేదని, త్వరలోనే అది సాకారమయ్యేలా ప్రయత్నం చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా సి.కల్యాణ్ తెలిపారు.
ఇక భారతీయ సినిమా వందేళ్ల వేడుకలను జూలై 12 నుంచి 14 వరకు చెన్నైలో నిర్వహించబోతున్నామని, రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి చిరంజీవి, అక్కినేని తదితర ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎ.పి.ఫిలిం చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, భారతీయ సినిమా వందేళ్ల సందర్భంగా ఈ స్టాంపులు విడుదల చేయాలనుకోవడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు.
గతంలో ఎన్టీఆర్., బి.ఎన్.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, సావిత్రి తదితరుల స్టాంపులు కూడా విడుదలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫిలించాంబర్ కార్యదర్శి అశోక్కుమార్ మాట్లాడుతూ, వందేళ్ల సందర్భంగా 100 స్టాంపులు విడుదలచేస్తే బావుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ, ఇందుకు సంబంధించి తాము ప్రతిపాదలను పంపిస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more