మహిళలకు అండగా ప్రిన్స్ మహేష్ బాబు మాటల్లో చెబుతున్నాడు. యువతులపై అత్యాచారాలు, వేధింపులు తరచూ వింటున్నాం. ఇక స్త్రీలపై వివక్ష చూపుతున్న ఘటనలూ చోటు చేసుకొంటున్నాయి . వీటిని ఎదురించటానికి టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నడుం బిగిస్తున్నారు. అసలే షూటింగ్లతో తామెంత బిజీగా ఉన్నప్పటికీ, కొందరు తారలు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవడం చూస్తూనేవున్నాం. అప్పట్లో పాతతరం తారలు మొదలుకుని నేటి తారల వరకు సామాజిక బాధ్యతను సంతోషంగా స్వీకరించిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పటికే ఆ వరుసలో మహేష్కూడా ఉన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న మహేష్బాబు ఇటు సినిమాలతోను, అటు వ్యాపార ప్రకటనలతోను ఎంత బిజీగా ఉన్నారో వేరుగా చెప్పనక్కరలేదు. అయినప్పటికీ, లోగడ ఓ సారి శిశువులకు మూలకణ వైద్యం ఆవశ్యకతను వెల్లడించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ మధ్య తమకు ఆడ శిశువు జన్మించిన సందర్భంలో మహేష్, నమ్రత దంపతులు ఈ మూలకణ వైద్యాన్ని ప్రచారం చేశారు. కాగా మరోసారి సామాజిక బాధ్యతతో ఓ మంచి కార్యక్రమానికి మహేష్బాబు చేయూతనిస్తున్నట్లు తెలిసింది. దేశంలో రోజురోజుకీ మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజంలో చైతన్యం తెచ్చేందుకు మార్డ్ (మెన్ అగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) అనే పేరుతో ఓ సంస్థను బాలీవుడ్ రచయిత, దర్శకుడు అక్తర్ నెలకొల్పారు.
దీనికి ప్రధాన ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు సినీరంగం నుంచి ఎంతో క్రేజ్ కలిగిన మహేష్బాబు అయితే బావుంటుందని భావించి, ఆయనను సంప్రదించారట. ఈ చైతన్య కార్యక్రమం తెలుగువెర్షన్కు వాయిస్ ఇవ్వడానికి మహేష్బాబు సంతోషంగా అంగీకరించారని అంటున్నారు. మహేష్బాబు ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు తమ సంస్థ ఆశయం చేరువకాగలదని అక్తర్ భావిస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more