ఒకరు అధికారంలో ఉన్న బంగారు తల్లి.. మరొకరు ప్రతిపక్షంలో ఉన్న మహాలక్ష్మీ..? పేర్లు వేరైన.. వీరి లక్ష్యం మాత్రం ఒక్కటే.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు మన రాజకీయ నాయకులు కల్పించే ఉన్నత పథకాలు. ఆడపిలల్లకు ‘బంగారు తల్లి ’ పథకంలో ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే ఉచితంగా చదువు చెప్పించటానికి ఉపయోగ పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి .. చెప్పటం జరిగింది. ఇప్పుడు బాలికల సంక్షేమం పథకానికి బదులు ఈ బంగారు తల్లి వచ్చిందని టిడిపి నాయకులు అంటున్నారు. ఇక అధికారం కోసం 63ఏళ్ల వయస్సులో 2817 కిలో మీటర్లు పాదయాత్ర ఒక రికార్డు స్రుష్టించిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో... మేము అధికారంలో వస్తే.. ‘రాష్ట్రంలోని బాలికల అభ్యున్నతి కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయకుడు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే మహాలక్ష్మి పథకం లో భాగంగా పుట్టిన ప్రతీ బాలిక పేరిట 25 వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. వారికి మైనారిటీ తీరే సమయానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామన్నారు. మహిళలకు, స్వయం సేవక సంఘాలకు వడ్డీలేన ఋణాలు, ప్రతి గ్యాసు కనెక్షన్ తోను సంవత్సరానికి పది గ్యాసు సెలిండర్లను అందిస్తామని హామీలు ఇచ్చారు.
'బంగారు తల్లి'!- ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మరో చరిత్రాత్మక చట్టమిది! దీని లక్ష్యం.. మహిళల సంక్షేమం, సంరక్షణ! మహిళల భద్రత విషయంలోనే కాదు.. వారి విద్య, ఆరోగ్యం విషయంలోనూ పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు ఒక పథకాన్ని ప్రారంభించి.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తరహాలో దానిని చట్టం చేయాలని భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకూ మహిళలకు ఉచితంగా విద్యను అందిస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించి వివిధ కార్యక్రమాలను చేపడతారు. మహిళల భద్రతకు నిర్దిష్ట చర్యలు తీసుకుంటారు. వీటన్నిటినీ సమ్మిళితం చేస్తూ, మహిళల కోసం సమీకృత పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం తీసుకొచ్చిన కిరణ్.. బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు కొనసాగింపుగా.. మహిళల కోసం కూడా ప్రత్యేక ప్రణాళికకు రూపకల్పన చేశారు. బాలికలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చే వరకు ప్రత్యేక పథకాలను అమలు చేసేలా సమీకృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇలా పోటీలు పడి పథకాలు పెడుతున్నారు. అసలు మహిళల పై జరుగుతున్న దాడులు, గ్యాంగ్ రేప్, బాలికల కిడ్నాఫ్ ల ద్రుష్టి సారించి .. వారికి రక్షణ కల్పిస్తే .. ఈ పథకాలకు ప్రయోజనం ఉంటుందని రాజీకయ విశ్లేషకులు అంటున్నారు. మహిళలకు రక్షణ లేకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన .ఫలితం శూన్యం అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఒకరు బంగారు తల్లి, మరొకరు మహాలక్ష్మీ అంటూ గొప్పులకు పోతున్నారు. ఆ పథకాలను అనుభవించటానికి అమ్మాయిలు బతికి ఉండాలి కదా అని మహిళ సంఘాలు అంటున్నాయి. ఆడవారికి రక్షణ లేకుండా ఎన్ని పథకాలు పెట్టిన ప్రయోజనం లేదని మహిళలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more