నెల్లురు ఆనం బ్రదర్ ఇప్పుడు రూటు మార్చారు. ఆనం బ్రదర్స్ ఏం చేసిన అది హాట్ టాఫిక్ అవుతుంది. ప్రజల్లో త్వరలో కలిసిపోయే నాయకుల్లో ఒకరు ఆనం బ్రదర్స్ . అయితే అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆనం బాణం వదిలింది. అమ్మ అనుగ్రహంతో ఆనం జగన్ పై రెచ్చిపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న అధికారిక నిర్ణయాలను, ఆయన కుమారుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మో హన్రెడ్డిని ఉద్దేశించి ఆర్థిక మంత్రి ఆనం రామనారా యణరెడ్డి ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు ఆషామాషీగా చేసినవేమీ కాదన్న ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా మాట్లాడే ఆనం, ఒక్కసారిగా జగన్పై విరుచుకు పడటం వెనుక పార్టీ అధినాయకత్వం అండదండలు, ఆదేశాలు పుష్కలంగా ఉన్నట్టే చెబుతున్నారు. అలాంటి దన్ను ఉన్నందుకే రోజుకు కొంతమంది మంత్రులు, సీనియర్ ఎమ్మె ల్యేలు ఆనం వ్యాఖ్యలకు అండగా నిలుస్తు న్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోక్ సభకు, ఇటు శాసనసభకు ముందస్తు ఎన్ని కలు జరుగుతాయన్న ప్రచారం రోజు రోజు కూ ఊపందుకుంటున్న తరుణంలో, ఒకవేళ అదే అనివార్యం అయితే జగన్ను, ఆయన పార్టీని తీవ్రాతితీవ్రమైన స్థాయిలో ఎదుర్కో వటమే మార్గం అనే నిర్ణయానికి కాంగ్రెస్ అధినాయకత్వం వచ్చినట్టు చెబుతున్నారు. జగన్ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేందుకు, బెయిల్ విషయంలో ప్రతిష్టం భన కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత ప్రయత్నించినా వైకాపా వైఖరి రోజు రోజుకూ మరింత పెరిగిపోతుండటంతో ఇక ఆ పార్టీ విషయంలో తుదకంటా ఎదురుదాడి చేయాలన్న నిర్ణయానికే కాంగ్రెస్ నాయకత్వం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అధినాయకత్వం ఆదేశాల నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వైకాపా అధ్యక్షుడి పైనా, ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పైనా కొద్ది రోజుల క్రితం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి మంత్రులను బలి పశువులను చేసిన జగన్ను ఉరి తీసినా తప్పేమీ లేదనే స్థాయికి వెళ్ళారు. వాస్తవానికి ఆనం గతంలోనూ వైఎస్ పైన, జగన్ పైనా విమర్శలు గుప్పించిన మాట వాస్తవం. నెల్లూరు లోక్సభస్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆనం సోదరులు తీవ్ర స్థాయిలో వైఎస్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. అయితే ఆ విమర్శల తీవ్రతకూ, ఇప్పుడు ఆనం చేసిన వ్యాఖ్యలకూ అసలు పోలికే లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఆనం ఆ వ్యాఖ్యలు చేసినట్టు పత్రికలలో వార్తలు రావటంతోనే మంత్రి కేబినెట్ సహచరుల నుంచి పూర్తి స్థాయి మద్దతు వెలువడటం ప్రారంభమైంది. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వద్ద నుంచి పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి వ్యాఖ్యలను బాహాటంగా సమర్థించారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, మరో మంత్రి శైలజానాథ్ తదితరులు మంత్రికి మద్దతుగా మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఏ నాయకుడూ మంత్రి వ్యాఖ్యలను కానీ, విమర్శలను కానీ తప్పు పట్టలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more