అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సమావేశంలో అర్థగంట సమయంలో 26 పేజీలు చదివి అలసిపోయిన మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు తిరుమలకు బయలుదేరారు. తిరుమలకు వెళ్లిన గవర్నర్ దంపతులకు టిటిడి అధికారులు స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను ఆ దేవదేవుడే చూసుకుంటాడని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనార్థం ఆయన సతీమణి విమల, కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి వచ్చారు. తొలుత తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల భద్రతపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల నేపథ్యంలో తిరుమల, తిరుపతితో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయన్నారు. ఆ దేవదేవుడే అంతా చూసుకుంటాడని చెప్పారు. మహిళలపై అత్యాచారాల నియంత్రణకు కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలనే రాష్ట్రంలోనూ పాటిస్తామని తెలిపారు. మహిళల రక్షణకు హైదరాబాద్లోని ప్రతి పోలీస్స్టేషన్లో ఉమెన్ రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అస్లెంబీలో ప్రతిపక్షాలు కాగితాలు విసరడంపై ఎలా స్పందిస్తున్నారన్న ప్రశ్నకు.. 'వారి పని వారు చేశారు. మా డ్యూటీ మేము చేస్తాం. మేమంతా స్నేహితులం' అని అన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన క్షేత్ర సంప్రదాయ ప్రకారం తొలుతగా భూవరాహస్వామిని దర్శించుకుని, రాత్రి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సన్నిధిలో ఆయనకు స్వామివారి వైభవాన్ని, స్థల ప్రాశస్థ్యాన్ని గురించి ప్రధాన అర్చకుడు వివరించారు. పెద్దజియ్యర్స్వామి ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. హుండీలో కానుకలు, వడ్డీకాసులు సమర్పించారు. ధ్వజస్తంభం, బలిపీఠాలను మొక్కుతూ రంగనాయకుల మండపం చేరుకున్న గవర్నర్ నరసింహన్కు వేదపండితులు ఆశీర్వాదం పలికారు. మీడియాతో మాట్లాడిన గవర్నర్ చాలా జాగ్రత్త మాట్లాడినట్లు తెలుస్తోంది. మీడియా ముందు గవర్నర్ నరసింహన్ చాలా సున్నితంగా వ్యవహరించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more