ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది తెలంగాణ అంశంపై చర్చిండానికా? లేక పిసిసి మార్పు గురించా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్తో పిసిసి అధ్యక్షుడు బొత్స భేటీ అయిన సందర్భంగా పిసిసి మార్పు గురించే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. పిసిసి పదవి నుంచి తప్పుకోవాలని నేరుగా చెప్పకుండా, ఏ పదవిలో కొనసాగుతారో నిర్ణయించుకోవాలని బొత్సకు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బొత్స ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసే కార్యక్రమం ఏదీ లేదని, తెలంగాణ అంశం మీదనే బొత్సను ఢిల్లీకి పిలిపించి ఉంటే సోనియాతో సమావేశం కచ్చితంగా ఉండేదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి, ప్రస్తుతం బొత్స పిసిసి అధ్యక్షునిగా, రవాణాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా కొనసాగాలా? పిసిసి అధ్యక్షునిగా ఉండాలా? అన్నది తేల్చుకోవాలని బొత్సకు ఆజాద్ చెప్పినట్టు తెలిసింది. బొత్స కూడా పిసిసి పదవి పట్ల ఇటీవల కాలంలో పెద్ద ఆసక్తిగా ఉండటం లేదు. పిసిసి పదవి చేపట్టిన కొత్తలో బొత్సలో కనిపించిన ఉత్సాహం ఇటీవల కాలంలో కనిపించడం లేదు. పిసిసి అధ్యక్షునిగా కన్నా మంత్రిగా కొనసాగడమే మంచిదన్న అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద బొత్స వ్యక్తం చేసినట్టు తెలిసింది.రాష్ట్ర విభజన విషయంలోను, కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిష్కరణ విషయంలోను బొత్స చేసిన ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీటిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని మొదట్లో ప్రశ్నించిన బొత్స తాజాగా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని విలేఖరుల సమావేశంలోనే వెల్లడించారు.
రాజమండ్రి కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు ఇటీవల సమైక్యాంధ్రపై నిర్వహించిన సదస్సుకు పిసిసి అధ్యక్షునిగా ఉన్న బొత్స హాజరుకావడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవంలో ముఖ్యమంత్రి, పలువురు కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ ఇంద్రసేనారెడ్డి బొత్సను నిలదీశారు. సహకార ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన సంబరాల్లో కాంగ్రెస్ నేతలు మునిగి ఉన్న సమయంలో తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బొత్స చేసిన సంచలన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. బొత్స ప్రకటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ చానళ్ళలో భారీ ప్రచారం జరిగింది. ఈ అంశాలన్నిటినీ బొత్స ప్రత్యర్థులు అధిష్ఠానవర్గానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా ఇటీవల రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా బొత్స వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. పిసిసి పదవి నుంచి తనను తప్పించడం ఖాయమన్న విషయం బొత్సకు ఐదారు నెలల కిందటే తెలుసు. ఈ విషయంపై మీడియా సమావేశాల్లో పలు సందర్భాల్లో బొత్స పరోక్ష సంకేతాలిచ్చారు. పిసిసి పదవిలో కొనసాగాలన్న ఆసక్తి కూడా బొత్సలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. అందువల్ల అధిష్ఠానం నిర్ణయం ఏమిటన్నది తమకు తెలియనప్పటికీ ఒకవేళ పిసిసి పదవి నుంచి తప్పుకోవాలని చెప్పినట్లయితే అది బొత్సకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదని సన్నిహితులు అంటున్నారు. పిసిసి పదవి నుంచి వైదొలగేందుకు బొత్స మానసికంగా ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more