ప్రముఖ హీరో కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం' సినిమాను నిషేధించలేదని, శాంతిభద్రతల దృష్ట్యా సినిమాను నిలిపివేశామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. తమిళనాడులో సినిమా నిషేదాన్ని జయ సమర్థించుకున్నారు 'విశ్వరూపం' నిషేదం వెనుక వ్యక్తిగత కారణాలు లేవని ఆమె చెప్పారు. కొంతమంది తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని జయలలిత మండిపడ్డారు. ప్రభుత్వంపై అపవాదులు మానుకోవాలని హితవు పలికారు. శాంతిభద్రతలు కాపాడటమే తమ బాధ్యత అని, హింస చోటు చేసుకుంటే బాధ్యులు ఎవరని జయలలిత ప్రశ్నించారు. విశ్వరూపం' సినిమా విడుదలైతే.. రక్షణ కోసం 56 వేల మంది పోలీసులు అవసరమని తమ దగ్గర అంతమంది పోలీసులు లేరన్నారు. గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త కోసమే 'విశ్వరూపం' సినిమాను నిలిపివేశామని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని జయలలిత పేర్కొన్నారు. జయ టీవీతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవన్నారు. తనపై ఆరోపణలు చేసినవారిపై కోర్టుకెళ్తానని జయ హెచ్చరించారు. ఈ సినిమాపై 25 ముస్లిం సంస్థలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాయని, ఆందోళనలకు దిగుతామని హెచ్చరించినట్లు జయ చెప్పారు.
శాంతి భద్రతలే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. సినిమాను నిషేధించే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. తమిళనాడులో 525 థియేటర్లకు రక్షణ కల్పించడం సాధ్యమా అని ప్రశ్నించారు. థియేటర్లకు రక్షణ కోసం 31,440 మంది పోలీసులు అవసరమని, ఇలాంటి అదనపు బాధ్యతల కోసం సరిపడా పోలీసులు తమ వద్ద లేదని జయలలిత తెలిపారు. కమల్ ప్రధానిని ఎంపిక చేయలేరని తనకు తెలుసన్నారు. కమల్తో తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు. కమల్ తనకు ప్రత్యర్థి కాదని...శత్రువు కాదని జయలలిత చెప్పారు. ఆయన అన్ని తెలిసిన పెద్దమనిషి అని, బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించాలని సూచించారు. ఈ సినిమా కోసం కమల్ రిస్క్ తీసుకున్నారని, ఆయన రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని జయలలిత ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more