రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆశ కల్పించి మళ్లీ మాట మారుస్తారని ఆయన ఆరోపించారు. 120 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ తెలంగాణ విషయంలో ఈ విధంగా వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఆ తరువాత రోశయ్య నాయకత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారని, ఆ తరువాత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే మాట తప్పి పరువు కోల్పోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలకు తల లేదని వెంకయ్య యద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని బిజెపి అధిష్ఠానం డిమాండ్ చేసింది. తెలంగాణపై ప్రధాని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై మన్మోహన్ ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరికి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని వెంకయ్య హెచ్చరించారు. ఒకసారి తెలంగాణ ఏర్పాటు చేస్తామంటారని, మరోసారి ఇందుకు విరుద్దంగా మాట్లాడతారని, ఏమిటిదని ఆయన ప్రశ్నించారు.
2004లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో టిఆర్ఎస్తో కలిసి ఎన్నికల ప్రచారం చేయలేదా? గులాబి కండువా కప్పుకోలేదా? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ అధిష్ఠానమే రాష్ట్రంలోని రెండు వర్గాలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించటం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను క్షమించరని హెచ్చరించారు. రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతింటోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన అనేదే లేకుండా పోయిందని, ఇందుకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ, యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మోసం చేసి అభివృద్ధి విషయంలో రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి నెట్టిందని ఆయన దుయ్యబట్టారు. నమ్మించి పోసం చేసిన కాంగ్రెస్ అవకాశ వాదం, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్, యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం గత తొమ్మది సంవత్సరాల నుండి తెలంగాణ అంశాన్ని నాన్చుతూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇకనైనా నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు వేయటం మానివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more