గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపి కొత్త అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలిసారు. ఈ ఇద్దరూ 2014లో జరగబోయే లోక్సభ ఎన్నికలల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చలు జరిపారు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి పదవికి ప్రధాన పోటీదారుల్లో ఒకరయిన నరేంద్ర మోడీ, రాజ్నాథ్ల మధ్య చర్చలు దాదాపు రెండు గంటల సేపు జరిగాయి. బిజెపి అధ్యక్షుడిగా రెండోసారి కూడా నితిన్ గడ్కరీ కొనసాగవచ్చని అందరూ అనుకుంటున్న సమయంలో చివరి నిమిషంలో జరిగిన నాటకీయ పరిణామాల కారణంగా గడ్కరీ పోటీనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో రాజ్నాథ్ సింగ్ బిజెపి కొత్త అధ్యక్షుడిగా నాలుగు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత మోడీ ఆయనను కలుసుకోవడం ఇదే మొదటిసారి. మీరు ఢిల్లీ రావడానికి కారణమేమిటని విలేఖరులు మోడీని అడగ్గా, సింగ్ను కలిసి అభినందనలు తెలియజేయడానికి తాను వచ్చినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా తాము 2014 లోక్సభ ఎన్నికలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు కూడా ఆయన చెప్పారు. ‘2014 ఎన్నికలపై చర్చ జరిగింది.
అది చాలా విస్తృతమైన చర్చ’ అని రాజ్నాథ్ సింగ్ నివాసంలో సమావేశం అనంతరం ఆ ఇద్దరూ బైటికి వచ్చాక విలేఖరులతో మాట్లాడుతూ మోడీ చెప్పారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి రాజ్నాథ్ సింగ్ను తాను సమయం కోరానని మోడీ తెలిపారు. అంతేకాకుండా తాను ఏం చేయాలి, రాబోయే రోజుల్లో తాను ఎలా పని చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఏం సలహాలు ఇవ్వదలిచారో అడగడం కోసం కూడా తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్తూ, దీనికి సంబంధించి ఆయన నుంచి సలహాలు లభించినట్లు కూడా చెప్పారు. దేశానికి సేవ చేసే విషయంలో బిజెపి గుజరాత్ విభాగం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటూ, ఈ విషయంలో కూడా తాము వివరంగా చర్చించామని తెలిపారు. తాను బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయిన రోజే మోడీ తనకు ఫోన్ చేసి తనను అభినందించడానికి స్వయంగా వస్తానని చెప్పారని రాజ్నాథ్ చెప్పారు. కాగా, పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీ ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానాన్ని దాట వేసారు. చెప్పాల్సినదంతా చెప్పాను’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more