ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పైసలు కోసం పరుగులు తీస్తున్నారు. కొంతమంది కుంభకోణాలు చేసిన లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. మరికొంద మాఫియా దందాలు చేసి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మనిషి ఎంత సంపాదించిన ఇక సంపాదించాలనే ఆశ తో కొన్ని విలువలు మరిచిపోయి డబ్బు మైకంలో ముందుకు పోతున్నా రోజులివి? ఇలాంటి రోజుల్లో కూడా తన దగ్గరకు కోరి వచ్చిన లక్ష్మీని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది వేలు, లక్షలు , కోట్లు, 150 కోట్లు రూపాయలు నడిచి అతని దగ్గరకు వస్తే , అతని ఆశయం కోసం సున్నితంగా 150 కోట్లను వెనక్కి పంపించాడు. అతని ఆ మార్పు చూసిన చాలా మంది ఆయన పై విమర్శలు కురిపిస్తున్నారు. ఆ అవకాశం మాకు రాలేదని చాలా భాదపడి పోతున్నారు. అందరు అతన్ని పాపం.. బ్యాంకు బాలెన్స్ పెంచుకోవడం తెలియదు. మరీ ఇంత సామాజిక స్పృహా?’ అంటూ అమీర్ ఖాన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలకు కారణం అమీర్ ఖాన్ తీసుకున్న ఓ నిర్ణయం. ఇప్పటివరకు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన అమీర్ ఖాన్ ఇకనుంచి ఏది పడితే అది చేయకూడదని నిర్ణయించుకున్నారు. సమాజానికి ఉపయోగపడే ప్రకటనలకు మాత్రమే ‘సై’ చెప్పాలనుకుంటున్నారు. అమీర్ ఖాన్ లో ఈ మార్పు రావడానికి కారణం ‘సత్యమేవ జయతే’. బుల్లితెరపై ప్రసారమైన ఈ కార్యక్రమానికి ఆమిర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరంలేదు.ఈ కార్యక్రమం ద్వారామహిళలపై లైంగిక వేధింపులు, భ్రూణ హత్యలు.. ఇలా ఎన్నో ప్రయోజనాత్మక అంశాలను చర్చించారు అమీర్ ఖాన్. ఫలితంగా ఆయనలో ఉన్న సామాజిక స్పృహ రెట్టింపు అయ్యింది. ఈ షో పూర్తయ్యి కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఆ ప్రభావం మాత్రం అమీర్ ఖాన్ మీద ఇంకా ఉంది.
అందుకే, ఇటీవల ఓ ఖరీదైన కార్ల కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించమని కోరితే నిర్మొహమాటంగా కుదరదని చెప్పేశారాయన. సదరు ఉత్పత్తిదారులు అమీర్ ఖాన్ కి కోట్లలో పారితోషికం ఇస్తామన్నారట. కానీ ఆ కారుకి ప్రచారం కల్పించడం సమాజానికి మేలు చేసే కార్యక్రమం కింద రాదంటూ సున్నితంగా కోట్ల రూపాయలను తిరస్కరించేశారు అమీర్ ఖాన్. ఈ విషయం విన్న కొంతమంది హీరోలు.. ఆ అవకాశం తమకు వచ్చి ఉంటే అమీర్ ఖాన్ లా వ్యవహరించి ఉండేవాళ్లం కాదని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఓ సందర్భంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘సత్యమేవ జయతే నాలో చాలా మార్పు తెచ్చింది. గత రెండేళ్లల్లో కొత్త అనుభవాలు ఎదుర్కొన్నాను. వాటిని డబ్బుతో వెలకట్టలేను. మేం కళాకారులం కాబట్టి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలి. దాంతోపాటు సమాజానికి మంచి చేసే బాధ్యత కూడా మా మీద ఉంది’’ అన్నారు. కొన్ని నెలల క్రితం 150 కోట్లు విలువ చేసే ప్రచారకర్త ఒప్పందాలను తిరస్కరించారు అమీర్ ఖాన్. తాజాగా.. మరో ఉత్పత్తిని వదులుకున్నారు. దీన్నిబట్టి సమాజ హితం కోసం మాత్రమే అడుగులేయాలని అమీర్ ఖాన్ బలంగా నిర్ణయించుకున్నారని అర్థం అవుతోంది. అమీర్ ఖాన్ లాగా అందరు హీరోలు మారిపోతే సమాజం చాలా బాగుపడుతుందని, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అమీర్ ఖాన్ సమాజం కోసం పాటు పడే వ్యక్తి అయితే ఆయన 150 కోట్లు వదిలేసుకోకుండా, ఆ ప్రచాకర్త ఒప్పందాలను ఒప్పుకొని, ఆ డబ్బుతో సమాజంలో ఉన్న పేదవారికి మేలు చేస్తే చాలా బాగుండేదని కొంత మంది ఆయన అభిమానులు అంటున్నారు. అయిన అందరికి అమీర్ లాంటి మనసు ఉండదు కదా? సో ఎవరి ఆశయం వారిది. అందరు అమీర్ ఖాన్ ఉండాలని చెప్పటం కూడా పెద్ద తప్పు అవుతుంది. ఎవరికి ఏ వయసులో సమాజం విలువులు తెలుసుకుంటారో, అప్పుడు వారిలో పెద్ద పెను మార్పు వస్తుందని అమీర్ ఖాన్ నవ్వుతూ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more